ETV Bharat / city

ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

author img

By

Published : Oct 17, 2020, 12:10 PM IST

Updated : Oct 17, 2020, 12:49 PM IST

cs-review-on-dharani-portal-management-and-readiness
ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

12:08 October 17

ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

     ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లకు దృశ్యమాధ్యమం ద్వారా సీఎస్​ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈనెల 25 విజయదశమి రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా...ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ ఏ మేరకు పూర్తయిందనే అంశాలపై దృష్టిసారించారు. ఎదురవుతున్న ఇబ్బందులు.. అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్​ కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 

        ఆస్తుల నమోదుకు ఇంకా నాలుగు రోజుల గడువే ఉండగా.. భారీ వర్షాల వల్ల కొంతమేరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ 70శాతం వరకు పూర్తవగా.. జీహెచ్​ఎంసీ పరిధిలో నెమ్మదించింది. ఇప్పటివరకు 75 లక్షలకుపైగా ఆస్తుల వివరాలను నమోదు చేశారు. రోజుకు 6లక్షలకుపైగా వివరాలు సేకరిస్తున్నారు. ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి తహసీల్దార్లకు 3రోజుల క్రితమే శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. వర్షాల వల్ల వాయిదా పడింది. ఈ అంశాలన్నింటిపైనా సీఎస్​ సోమేష్‌కుమార్‌ దృష్టిసారించారు.

ఇవీ చూడండి: జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత

12:08 October 17

ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

     ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లకు దృశ్యమాధ్యమం ద్వారా సీఎస్​ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈనెల 25 విజయదశమి రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా...ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ ఏ మేరకు పూర్తయిందనే అంశాలపై దృష్టిసారించారు. ఎదురవుతున్న ఇబ్బందులు.. అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్​ కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 

        ఆస్తుల నమోదుకు ఇంకా నాలుగు రోజుల గడువే ఉండగా.. భారీ వర్షాల వల్ల కొంతమేరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ 70శాతం వరకు పూర్తవగా.. జీహెచ్​ఎంసీ పరిధిలో నెమ్మదించింది. ఇప్పటివరకు 75 లక్షలకుపైగా ఆస్తుల వివరాలను నమోదు చేశారు. రోజుకు 6లక్షలకుపైగా వివరాలు సేకరిస్తున్నారు. ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి తహసీల్దార్లకు 3రోజుల క్రితమే శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. వర్షాల వల్ల వాయిదా పడింది. ఈ అంశాలన్నింటిపైనా సీఎస్​ సోమేష్‌కుమార్‌ దృష్టిసారించారు.

ఇవీ చూడండి: జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత

Last Updated : Oct 17, 2020, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.