ETV Bharat / city

ఏపీ సీఎం జగన్​కు కరోనా పరీక్ష... నెగిటివ్​గా నిర్ధరణ​

author img

By

Published : Apr 17, 2020, 7:29 PM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు వైద్యులు కోవిడ్-19 పరీక్ష నిర్వహించారు. ఫలితాల్లో నెగిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో ఇవాళ రాష్ట్రానికి లక్ష ర్యాపిడ్​ టెస్టు కిట్లు వచ్చాయి. వాటి పరిశీలనలో భాగంగా సీఎం జగన్​ తొలిసారిగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు.

కొవిడ్-19 ఫలితాల్లో ఏపీ సీఎంకు నెగిటివ్
కొవిడ్-19 ఫలితాల్లో ఏపీ సీఎంకు నెగిటివ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు వైద్యులు కోవిడ్‌ –19 పరీక్ష చేశారు. రాష్ట్ర స్థాయి కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు సీఎం జగన్ చేతి నుంచి రక్త నమూనాలు సేకరించారు. దక్షిణ కొరియా నుంచి నేడు ఏపీకి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయి. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ కిట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఈ కిట్లతోనే ముఖ్యమంత్రి జగన్​కు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో కరోనా వైరస్ లేనట్లుగా ఫలితం వచ్చింది. ర్యాపిడ్​ టెస్టు కిట్ ద్వారా కేవలం పది నిముషాల్లోనే ఫలితం వచ్చిందని సీఎంవో కార్యాలయం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు వైద్యులు కోవిడ్‌ –19 పరీక్ష చేశారు. రాష్ట్ర స్థాయి కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు సీఎం జగన్ చేతి నుంచి రక్త నమూనాలు సేకరించారు. దక్షిణ కొరియా నుంచి నేడు ఏపీకి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయి. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ కిట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఈ కిట్లతోనే ముఖ్యమంత్రి జగన్​కు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో కరోనా వైరస్ లేనట్లుగా ఫలితం వచ్చింది. ర్యాపిడ్​ టెస్టు కిట్ ద్వారా కేవలం పది నిముషాల్లోనే ఫలితం వచ్చిందని సీఎంవో కార్యాలయం వెల్లడించింది.

ఇవీ చూడండి : ఒక్కరితో ఎందరికో.. 11 మందితో 106 మందికి వైరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.