ETV Bharat / city

కర్నూలులో 11 నెలల చిన్నారికి పాజిటివ్​

author img

By

Published : Apr 29, 2020, 5:44 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కర్నూలులో కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 11 నెలల చిన్నారికి వైరస్​ పాజిటివ్​గా తేలడం కలకలం రేపింది. అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

కర్నూలులో 11 నెలల చిన్నారికి పాజిటివ్​
కర్నూలులో 11 నెలల చిన్నారికి పాజిటివ్​

ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జొహారాపురం గ్రామంలో 11 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి దిల్లీ మర్కజ్​ వెళ్లి రావటంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. క్వారంటైన్‌ పూర్తైన అనంతరం వారిని పరీక్షించగా నెగిటివ్‌ రావడం వల్ల ఇటీవలే వారు ఇంటికి తిరిగి వచ్చారు.

మరోసారి వారికి వైద్య పరీక్షలు చేయగా.. ఆ కుటుంబంలో చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. విషయం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ రామకృష్ణ, ఆలూరు సీఐ భాస్కర్‌ గ్రామాన్ని సందర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జొహారాపురం గ్రామంలో 11 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి దిల్లీ మర్కజ్​ వెళ్లి రావటంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. క్వారంటైన్‌ పూర్తైన అనంతరం వారిని పరీక్షించగా నెగిటివ్‌ రావడం వల్ల ఇటీవలే వారు ఇంటికి తిరిగి వచ్చారు.

మరోసారి వారికి వైద్య పరీక్షలు చేయగా.. ఆ కుటుంబంలో చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. విషయం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ రామకృష్ణ, ఆలూరు సీఐ భాస్కర్‌ గ్రామాన్ని సందర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఇవీ చూడండి: సాదాసీదాగా తెజస వార్షికోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.