ETV Bharat / city

ఏపీలో రికార్డు స్థాయిలో 10,759 కరోనా కేసులు నమోదు

ఏపీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,871 పరీక్షలు నిర్వహించారు. 10,759 కేసులు నిర్ధరణ కాగా 31 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

author img

By

Published : Apr 22, 2021, 6:50 PM IST

ap corona cases, ap corona news
కొత్తగా 10,759 రికార్డు కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 41,871 పరీక్షలు నిర్వహించారు. 10,759 కేసులు నిర్ధరణ కాగా 31 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 3,992 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 66,944 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కేసులు..

గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,474 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం 1,336, గుంటూరు 1,186, తూర్పుగోదావరి 992, కర్నూలు 1,367, విశాఖ 844, కృష్ణా 679, విజయనగరం 562, ప్రకాశం 345, కడప 279, నెల్లూరు 816, అనంతపురం 789, పశ్చిమగోదావరి 90 చొప్పున కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు..

గత 24 గంటల వ్యవధిలో చిత్తూరు జిల్లాలో 5, కృష్ణా 5, కర్నూలు 3, నెల్లూరు 3, ప్రకాశం 3, శ్రీకాకుళం 3, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, విజయనగరం 2, అనంతపురం 1, కడప 1, విశాఖ 1 చొప్పున ప్రాణాలు విడిచారు.

ap corona cases, ap corona news
కొత్తగా 10,759 రికార్డు కరోనా కేసులు నమోదు

ఇదీ చదవండి : కరోనా చికిత్స బిల్లులను సీఎం సహాయనిధి నుంచి చెల్లించండి: జీవన్​రెడ్డి

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 41,871 పరీక్షలు నిర్వహించారు. 10,759 కేసులు నిర్ధరణ కాగా 31 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 3,992 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 66,944 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కేసులు..

గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,474 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం 1,336, గుంటూరు 1,186, తూర్పుగోదావరి 992, కర్నూలు 1,367, విశాఖ 844, కృష్ణా 679, విజయనగరం 562, ప్రకాశం 345, కడప 279, నెల్లూరు 816, అనంతపురం 789, పశ్చిమగోదావరి 90 చొప్పున కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు..

గత 24 గంటల వ్యవధిలో చిత్తూరు జిల్లాలో 5, కృష్ణా 5, కర్నూలు 3, నెల్లూరు 3, ప్రకాశం 3, శ్రీకాకుళం 3, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, విజయనగరం 2, అనంతపురం 1, కడప 1, విశాఖ 1 చొప్పున ప్రాణాలు విడిచారు.

ap corona cases, ap corona news
కొత్తగా 10,759 రికార్డు కరోనా కేసులు నమోదు

ఇదీ చదవండి : కరోనా చికిత్స బిల్లులను సీఎం సహాయనిధి నుంచి చెల్లించండి: జీవన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.