Corona Cases in Tirupati IIT Campus : ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీలో కరోనా తాండవం చేస్తోంది. ఏర్పేడు సమీపంలోని శాశ్వత ప్రాంగణంలో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 40 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
Covid Cases in Tirupati IIT Campus : కరోనా సోకిన వారిని క్యాంపస్లోని క్వారంటైన్లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈనెల మొదటి వారంలో సుమారు 600 మంది విద్యార్థులు సొంత ప్రాంతాలకు వెళ్లడంతో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే క్యాంపస్ లో ఉన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
- ఇదీ చదవండి : దేశంలో 3 లక్షల 33 వేల కొత్త కేసులు.. 525 మరణాలు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!