ETV Bharat / city

Covid Effect: కరోనా కాలం.. ఆటోడ్రైవర్ల బతుకులు ఆగమాగం

author img

By

Published : Jun 9, 2021, 12:01 PM IST

కరోనా ప్రభావంతో వందలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. గిరాకీలు లేక, పూట గడవని పరిస్థితి ఏర్పడటంతో... కొంతమంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మిగిలినవారు బతుకుదెరువు కోసం ఇక్కడే ఉంటూ... వచ్చిన సొమ్ముతో జీవనం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వమే తమకు ఏదైనా దారి చూపించాలని వేడుకుంటున్నారు.

corona effect on auto drivers in hyderabad
corona effect on auto drivers in hyderabad
కరోనా కాలం.. ఆటోడ్రైవర్ల బతుకులు ఆగమాగం

కొవిడ్‌ కారణంగా గిరాకీలు లేక ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మొదటి దశలో ఏడు నెలలకు పైగా ఆటోలు మూలనపడ్డాయి. తిరిగి రోడ్డెక్కిన తర్వాత ఆటోల్లో వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపలేదు. వైరస్‌ భయంతో సొంత వాహనాలకు మెుగ్గు చూపారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి మారుతుందన్న తరుణంలో రెండోదశ మళ్లీ దెబ్బకొట్టింది. ఫలితంగా ఉపాధి కరువై... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6లక్షల ఆటో డ్రైవర్లలో సగం మంది నగరాలు, పట్ణణాల నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. ఇక్కడే ఉన్న కొందరు వచ్చిన డబ్బుతో... జీవనం గడుపుతున్నారు.

క‌రోనాకు ముందు విద్యాసంస్థల‌కు 40 శాతం ఆటోలు నడిపేవారు. గ్రేట‌ర్ హైదరాబాద్‌ ప‌రిధిలో 2 ల‌క్షల 25వేల ఆటోలు ఉండగా.... 80వేల వరకు విద్యాసంస్థల‌కు తిరిగేవి. ప్రస్తుతం విద్యాసంస్థలు, క‌ళాశాల‌లు మూసివేయటంతో... ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. గిరాకీలు చాలా త‌క్కువ‌గా ఉంటున్నాయ‌ని.... ఇల్లు గడవటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆటోలు న‌డిపే వారిలో ఎక్కువమంది రుణాలు తీసుకుని వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. మరికొంత మంది అద్దెకు తీసుకుని నడుపుకుంటారు. రుణం తీసుకున్న వారు డబ్బులు లేక చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. సమయానికి డబ్బులు కట్టకపోతే.... ఆటోలు లాక్కెళ్తున్నారని చెబుతున్నారు. రోజంతా కష్టపడినా.... 500 రూపాయలు కూడా మిగలటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజీల్, గ్యాస్ రేట్లు పెరగటం మరింత ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు.

క‌రోనా కేసులు త‌గ్గి...సాధార‌ణ స్థితికి వ‌చ్చే వ‌ర‌కు ఫైనాన్షియ‌ర్ల ఒత్తిడి లేకుండా చూడాల‌ని ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: Lemon: దారుణంగా పడిపోయిన నిమ్మకాయల టోకు ధరలు

కరోనా కాలం.. ఆటోడ్రైవర్ల బతుకులు ఆగమాగం

కొవిడ్‌ కారణంగా గిరాకీలు లేక ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మొదటి దశలో ఏడు నెలలకు పైగా ఆటోలు మూలనపడ్డాయి. తిరిగి రోడ్డెక్కిన తర్వాత ఆటోల్లో వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపలేదు. వైరస్‌ భయంతో సొంత వాహనాలకు మెుగ్గు చూపారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి మారుతుందన్న తరుణంలో రెండోదశ మళ్లీ దెబ్బకొట్టింది. ఫలితంగా ఉపాధి కరువై... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6లక్షల ఆటో డ్రైవర్లలో సగం మంది నగరాలు, పట్ణణాల నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. ఇక్కడే ఉన్న కొందరు వచ్చిన డబ్బుతో... జీవనం గడుపుతున్నారు.

క‌రోనాకు ముందు విద్యాసంస్థల‌కు 40 శాతం ఆటోలు నడిపేవారు. గ్రేట‌ర్ హైదరాబాద్‌ ప‌రిధిలో 2 ల‌క్షల 25వేల ఆటోలు ఉండగా.... 80వేల వరకు విద్యాసంస్థల‌కు తిరిగేవి. ప్రస్తుతం విద్యాసంస్థలు, క‌ళాశాల‌లు మూసివేయటంతో... ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. గిరాకీలు చాలా త‌క్కువ‌గా ఉంటున్నాయ‌ని.... ఇల్లు గడవటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆటోలు న‌డిపే వారిలో ఎక్కువమంది రుణాలు తీసుకుని వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. మరికొంత మంది అద్దెకు తీసుకుని నడుపుకుంటారు. రుణం తీసుకున్న వారు డబ్బులు లేక చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. సమయానికి డబ్బులు కట్టకపోతే.... ఆటోలు లాక్కెళ్తున్నారని చెబుతున్నారు. రోజంతా కష్టపడినా.... 500 రూపాయలు కూడా మిగలటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజీల్, గ్యాస్ రేట్లు పెరగటం మరింత ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు.

క‌రోనా కేసులు త‌గ్గి...సాధార‌ణ స్థితికి వ‌చ్చే వ‌ర‌కు ఫైనాన్షియ‌ర్ల ఒత్తిడి లేకుండా చూడాల‌ని ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: Lemon: దారుణంగా పడిపోయిన నిమ్మకాయల టోకు ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.