ETV Bharat / city

ప్రతి కార్యకర్తను కలుస్తా.. పార్టీని బలోపేతం చేస్తా: మాణిక్కం ఠాగూర్​

author img

By

Published : Sep 28, 2020, 7:49 PM IST

తెలంగాణ కాంగ్రెస్​లో యువతకు పెద్దపీట వేసి... క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ అన్నారు. 2023 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామన్నారు. పీసీసీ మార్పు తన పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు.

congress state incharge manickam tagore chitchat with media
ప్రతి కార్యకర్తను కలుస్తా.. పార్టీ బలోపేతం చేస్తా: మాణిక్కం ఠాగూర్​

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్​ అన్నారు. 2023 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రెండు రోజులుగా హైదరాబాద్​లో మకాం వేసి పార్టీ నాయకులతో వరస సమావేశాలు నిర్వహించిన ఆయన... ఇవాళ గాంధీ భవన్​లో మీడియాతో చిట్​చాట్​ చేశారు. పీసీసీ మార్పు విషయం తన పరిధిలోని కాదన్న ఠాగూర్​... అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి కార్యకర్తను కలుస్తానన్నారు.

రాష్ట్రంలో మంచి నాయకులు ఉన్నారని, యువతకు పెద్దపీట వేసి... క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఠాగూర్​ వివరించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మండలాల వారీగా ఇంఛార్జ్​లను నియమించి పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ నేతల్లో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉన్నప్పటికీ... పార్టీ స్టాండ్​ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు. 2014, 2018 ఎన్నికల నేపథ్యం వేరన్న ఠాగూర్​... గతంలో జరిగిన విషయాలు నెమరువేసుకొని రాబోయే ఎన్నికలకు వెళ్తామన్నారు.

తాము గవర్నర్ అపాయింట్​మెంట్​ ముందే కోరినా... అక్కడి నంచి స్పందన రాలేదని ఠాగూర్ ఆరోపించారు. అన్ని రాష్ట్రాలకు గవర్నర్లు ఉన్నారని, ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదని ఆరోపించారు. తమిళనాడు-తెలంగాణ రాజకీయాలు వేరు కాదని, రెండూ కూడా ఉద్వేగంతో కూడిన రాష్ట్రాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయాలు రావాలంటే ప్రతిసారి ఒకే వ్యూహం ఉపయోగపడదని, పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మార్చుకోవాలన్నారు. తమిళనాడు-తెలంగాణ ప్రజలు ఒకే ఎమోషనల్ కలిగినవారని, తన నియోజకవర్గంలోనూ... చాలా మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారని తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్​కి మద్దతు ఇచ్చే విషయం కమిటీ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ప్రతి ఒక్కరూ ఓ అభ్యర్థిలా పనిచేసినప్పుడే గెలుపు: మాణిక్కం

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్​ అన్నారు. 2023 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రెండు రోజులుగా హైదరాబాద్​లో మకాం వేసి పార్టీ నాయకులతో వరస సమావేశాలు నిర్వహించిన ఆయన... ఇవాళ గాంధీ భవన్​లో మీడియాతో చిట్​చాట్​ చేశారు. పీసీసీ మార్పు విషయం తన పరిధిలోని కాదన్న ఠాగూర్​... అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి కార్యకర్తను కలుస్తానన్నారు.

రాష్ట్రంలో మంచి నాయకులు ఉన్నారని, యువతకు పెద్దపీట వేసి... క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఠాగూర్​ వివరించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మండలాల వారీగా ఇంఛార్జ్​లను నియమించి పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ నేతల్లో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉన్నప్పటికీ... పార్టీ స్టాండ్​ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు. 2014, 2018 ఎన్నికల నేపథ్యం వేరన్న ఠాగూర్​... గతంలో జరిగిన విషయాలు నెమరువేసుకొని రాబోయే ఎన్నికలకు వెళ్తామన్నారు.

తాము గవర్నర్ అపాయింట్​మెంట్​ ముందే కోరినా... అక్కడి నంచి స్పందన రాలేదని ఠాగూర్ ఆరోపించారు. అన్ని రాష్ట్రాలకు గవర్నర్లు ఉన్నారని, ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదని ఆరోపించారు. తమిళనాడు-తెలంగాణ రాజకీయాలు వేరు కాదని, రెండూ కూడా ఉద్వేగంతో కూడిన రాష్ట్రాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయాలు రావాలంటే ప్రతిసారి ఒకే వ్యూహం ఉపయోగపడదని, పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మార్చుకోవాలన్నారు. తమిళనాడు-తెలంగాణ ప్రజలు ఒకే ఎమోషనల్ కలిగినవారని, తన నియోజకవర్గంలోనూ... చాలా మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారని తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్​కి మద్దతు ఇచ్చే విషయం కమిటీ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ప్రతి ఒక్కరూ ఓ అభ్యర్థిలా పనిచేసినప్పుడే గెలుపు: మాణిక్కం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.