ETV Bharat / city

అత్యాచారం, హత్యకు గురైన యువతి కుటుంబానికి వీహెచ్​ పరామర్శ

author img

By

Published : Oct 1, 2020, 7:52 AM IST

ఇటీవల అత్యాచారం, హత్యకు గురైన మొయినాబాద్​కు చెందిన యువతి కుటుంబాన్ని కాంగ్రెస్ సీనీయర్ నేత వి.హనుమంతరావు పరామర్శించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కోరారు.

అత్యాచారం, హత్యకు గురైన యువతి కుటుంబానికి వీహెచ్​ పరామర్శ
అత్యాచారం, హత్యకు గురైన యువతి కుటుంబానికి వీహెచ్​ పరామర్శ

ఇటీవల అత్యాచారం, హత్యకు గురైన మొయినాబాద్​కు చెందిన యువతి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పరామర్శించారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానంలో విచారణ జరిపి నిందితులకు మూడు నెలల్లో శిక్షపడేలా చూడాలన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం, డబుల్ బెడ్‌ రూం ఇల్లు, ఆమె సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వీహెచ్‌ కోరారు.

ఇటీవల అత్యాచారం, హత్యకు గురైన మొయినాబాద్​కు చెందిన యువతి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పరామర్శించారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానంలో విచారణ జరిపి నిందితులకు మూడు నెలల్లో శిక్షపడేలా చూడాలన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం, డబుల్ బెడ్‌ రూం ఇల్లు, ఆమె సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వీహెచ్‌ కోరారు.

ఇదీ చూడండి: కరోనా బాధితులకు పండ్ల పంపిణీ చేసిన జడ్పీ ఛైర్మన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.