ETV Bharat / city

'గాంధీ కుటుంబానికి భద్రత తొలగింపు సరికాదు' - మహారాష్ట్ర రాజకీయలపై వీహెచ్​

గాంధీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణ దళం భద్రత తొలగించడంపై కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్​షా తీరును తప్పుపట్టారు. ఆర్టీసీ సమస్యకు పరిష్కారం చూపకపోతే సమస్యల మరింత జఠిలం అవుతుందని వీహెచ్​ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కాంగ్రెస్​ను అలా అంటే ఊరుకునేది లేదు: వీహెచ్​
author img

By

Published : Nov 12, 2019, 2:55 PM IST

Updated : Nov 12, 2019, 3:48 PM IST

యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, రాహుల్​, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రత తొలగించడంపై ఆ పార్టీ సీనియర్​ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భద్రత తొలగింపుపై పునరాలోచించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాలను కోరారు. దేశంలో మిగతా పార్టీలు ఉండొద్దని భాజపా నేతలు కోరుకుంటున్నారని.. మహారాష్ట్రలో గవర్నర్​ ఆహ్వానించినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారని వీహెచ్​ ఎద్దేవా చేశారు.

తెలంగాణలో జై జవాన్​, జై కిసాన్​ నినాదం అమలుకావడం లేదని వీహెచ్​ అన్నారు. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ తీసుకొస్తామని కేసీఆర్​ చెప్పినా.. పరిస్థితిలో మార్పురాలేదని ఆరోపించారు. రోజు రోజుకు రెవెన్యూ సమస్యలు జఠిలం అవుతున్నయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై కిసాన్​ కాంగ్రెస్​ పోరాటం చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా తన నంబర్​ 9704937780 కు ఫోన్​ చేయాలని సూచించారు. గోల్నాక ఘటనపై అధికార యంత్రాంగం సరిగా వ్యవహరించలేదని వీహెచ్​ మండిపడ్డారు. కనీసం ఘటనా స్థలాన్ని ఆర్టీవో, తహసీల్దార్​లు పరిశీలించలేదని ఆరోపించారు.

కాంగ్రెస్​ను అలా అంటే ఊరుకునేది లేదు: వీహెచ్​

ఇవీచూడండి: 'కార్మికులను పిలవకపోతే మమ్మల్ని పిలవండి'

యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, రాహుల్​, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రత తొలగించడంపై ఆ పార్టీ సీనియర్​ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భద్రత తొలగింపుపై పునరాలోచించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాలను కోరారు. దేశంలో మిగతా పార్టీలు ఉండొద్దని భాజపా నేతలు కోరుకుంటున్నారని.. మహారాష్ట్రలో గవర్నర్​ ఆహ్వానించినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారని వీహెచ్​ ఎద్దేవా చేశారు.

తెలంగాణలో జై జవాన్​, జై కిసాన్​ నినాదం అమలుకావడం లేదని వీహెచ్​ అన్నారు. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ తీసుకొస్తామని కేసీఆర్​ చెప్పినా.. పరిస్థితిలో మార్పురాలేదని ఆరోపించారు. రోజు రోజుకు రెవెన్యూ సమస్యలు జఠిలం అవుతున్నయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై కిసాన్​ కాంగ్రెస్​ పోరాటం చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా తన నంబర్​ 9704937780 కు ఫోన్​ చేయాలని సూచించారు. గోల్నాక ఘటనపై అధికార యంత్రాంగం సరిగా వ్యవహరించలేదని వీహెచ్​ మండిపడ్డారు. కనీసం ఘటనా స్థలాన్ని ఆర్టీవో, తహసీల్దార్​లు పరిశీలించలేదని ఆరోపించారు.

కాంగ్రెస్​ను అలా అంటే ఊరుకునేది లేదు: వీహెచ్​

ఇవీచూడండి: 'కార్మికులను పిలవకపోతే మమ్మల్ని పిలవండి'

Last Updated : Nov 12, 2019, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.