ఫౌల్ట్రీ ఫెడరేషన్లో భారీ కుంభకోణం జరిగిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. బిహార్లో జరిగిన గడ్డి కుంభకోణం కంటే మన రాష్ట్రంలో జరిగిన మొక్కజొన్నల కుంభకోణం చాలా పెద్దదని... హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మొక్కజొన్న రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ విచారణకు ఆదేశించాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సుమారు 34వేల టన్నుల విత్తనాలు తీసుకున్నారని ఆరోపించారు. సన్నకారు, పౌల్ట్రీ రైతులు ఎన్నో దఫాలుగా ప్రభుత్వ అధికారులను కలిసినా ఎలాంటి న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ ఫెడరేషన్లో జరుగుతున్న కుంభకోణంలో ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్