తెలంగాణ పోరాటయోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటంలో... తొలి, మలి దశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లోనూ నర్సింగరావు పాత్ర మరువలేనిదని సీఎం కొనియాడారు.
ఎన్నో కమ్యూనిస్టు, ప్రగతిశీల ఉద్యమాలను బూర్గుల ముందుండి నడిపించారని గుర్తు చేసుకున్నారు. నర్సింగరావు మరణం రాష్ట్రానికి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బూర్గుల కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.