ETV Bharat / city

రైతులు నియంత్రిత పద్ధతిలో సాగుకు ముందుకు రావాలి: సీఎం

రైతులు నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ సూచించారు. రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం పొందాలని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు మంచి ధర పొందాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు.

author img

By

Published : May 21, 2020, 9:18 PM IST

Updated : May 21, 2020, 10:09 PM IST

cm kcr
cm kcr

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న, నాణ్యమైన పంటలు పండించి మంచి ధర పొందాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ పంట వేస్తే లాభసాటి ఉంటుందో వ్యవసాయ వర్సిటీ తగు సూచనలు చేస్తుందని.. రాష్ట్రంలోని విభిన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకుని లాభాలు పొందాలని సూచించారు. నియంత్రిత సాగు విధాన ఖరారు కోసం ప్రగతి భవన్​లో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించి... సాగు విధానంపై పలు సూచనలు చేశారు.

రాష్ట్ర రైతులు ప్రపంచంతో పోటీ పడాలని ముఖ్యమంత్రి ఆశించారు. రైతులంతా ఒకే పంట వేయడం వల్ల డిమాండ్‌ తగ్గి నష్టాలపాలయ్యే అవకాశాలున్నాయని... డిమాండ్‌ మేరకే పంటలు సాగు చేయాలని సూచిస్తున్నామన్నారు.

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న, నాణ్యమైన పంటలు పండించి మంచి ధర పొందాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ పంట వేస్తే లాభసాటి ఉంటుందో వ్యవసాయ వర్సిటీ తగు సూచనలు చేస్తుందని.. రాష్ట్రంలోని విభిన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకుని లాభాలు పొందాలని సూచించారు. నియంత్రిత సాగు విధాన ఖరారు కోసం ప్రగతి భవన్​లో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించి... సాగు విధానంపై పలు సూచనలు చేశారు.

రాష్ట్ర రైతులు ప్రపంచంతో పోటీ పడాలని ముఖ్యమంత్రి ఆశించారు. రైతులంతా ఒకే పంట వేయడం వల్ల డిమాండ్‌ తగ్గి నష్టాలపాలయ్యే అవకాశాలున్నాయని... డిమాండ్‌ మేరకే పంటలు సాగు చేయాలని సూచిస్తున్నామన్నారు.

Last Updated : May 21, 2020, 10:09 PM IST

For All Latest Updates

TAGGED:

cm kcr
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.