ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజ చేసి పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు, కుమార్తె కవిత, ఇతర కుటుంబ సభ్యులు, అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
- ఇదీ చూడండి : రాజ్భవన్లో గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజలు