వినాయక చవితిని పర్యావరణరహితంగా జరుపుకునేందుకు హరిత భారత్ సవాల్లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పంపిణీ చేస్తున్న విత్తన గణపతిని చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి స్వీకరించారు. వినాయక నిమజ్జనం అనంతరం మొలకెత్తే విత్తనాన్ని తన ఇంట్లోనే నాటనున్నట్టు ఎంపీ తెలిపారు. ఈ సవాల్ను తన పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ప్రజా ప్రతినిధులందరూ స్వీకరించాలని కోరారు.
సంతోష్కు అభినందనలు
ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీఓపీ)తో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణ దెబ్బతిని, కాలుష్యం పెరుగుతుందని రంజిత్ రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణకై ప్రపంచ వ్యాప్తంగా విస్తృత చర్చ కొనసాగుతున్న తరుణంలో తన సహచర రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపడుతున్న కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని... అందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
మట్టి విగ్రహాలకే ప్రాధాన్యతనివ్వాలి
పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఎంపీ పేర్కొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని గణేష్ మండపాల్లో మట్టి వినాయక విగ్రహాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.