ETV Bharat / city

ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తానని ఫోన్​.. కానీ ఆ తర్వాత..!

author img

By

Published : Aug 10, 2021, 10:37 PM IST

లాక్‌డౌన్‌ సమయంలో ఎందరో అభాగ్యులకు సహాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నటుడు సోనూసూద్. ఇప్పుడు అతని పేరును అడ్డం పెట్టుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో సోనూసూద్ పేరుతో ఫోన్​ చేసి, సహాయం చేస్తానని నమ్మించి డబ్బులు దండుకున్నాడు ఓ ఆగంతుకుడు.

cheating
సోనూసూద్
ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తానని ఫోన్​..కానీ ఆ తర్వాత..!

ఏపీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి వెలమవీధికి చెందిన రాంబాబు.. కుటుంబ పరిస్థితి సరిగా లేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ చదువుకుంటున్నాడు. తండ్రి కరోనాతో మృతి చెందగా, తల్లి పక్షవాతంతో మంచానికి పరిమితమైంది. రాంబాబు ఇబ్బందులను గమనించిన అతని మిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో సాయం చేయాలని కోరారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఓ ఆగంతుకుడు బాధితుడికి సాయం చేస్తానని చెప్పి మోసానికి పాల్పడ్డాడు.

సోనూసూద్​ను మాట్లాడుతున్నానంటూ రాంబాబుకు ఫోన్ చేశాడు. ట్రస్ట్ ద్వారా రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తానని నమ్మించాడు. దీనికోసం రూ.10 వేలు జీఎస్టీ కట్టాలని, రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసం ముందుగా రూ.2 వేలు ఫోన్ పే చేయాలని చెప్పాడు. నిజమేనని నమ్మిన రాంబాబు తన మిత్రుడి సహాయంతో రూ.2వేలు పంపించాడు. గంట తర్వాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఈ ఘటనపై బాధితుడు సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆగంతుకుడు కర్ణాటక వాసిగా గుర్తించినట్లు ఎస్​ఐ గోవింద్​ తెలిపారు.

ఇవీ చూడండి: ఇంద్రవెల్లి స్ఫూర్తితో గడీల పాలనను పారదోలుదాం: రేవంత్ రెడ్డి

'రాజకీయంగా నష్టమని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు'

ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తానని ఫోన్​..కానీ ఆ తర్వాత..!

ఏపీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి వెలమవీధికి చెందిన రాంబాబు.. కుటుంబ పరిస్థితి సరిగా లేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ చదువుకుంటున్నాడు. తండ్రి కరోనాతో మృతి చెందగా, తల్లి పక్షవాతంతో మంచానికి పరిమితమైంది. రాంబాబు ఇబ్బందులను గమనించిన అతని మిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో సాయం చేయాలని కోరారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఓ ఆగంతుకుడు బాధితుడికి సాయం చేస్తానని చెప్పి మోసానికి పాల్పడ్డాడు.

సోనూసూద్​ను మాట్లాడుతున్నానంటూ రాంబాబుకు ఫోన్ చేశాడు. ట్రస్ట్ ద్వారా రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తానని నమ్మించాడు. దీనికోసం రూ.10 వేలు జీఎస్టీ కట్టాలని, రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసం ముందుగా రూ.2 వేలు ఫోన్ పే చేయాలని చెప్పాడు. నిజమేనని నమ్మిన రాంబాబు తన మిత్రుడి సహాయంతో రూ.2వేలు పంపించాడు. గంట తర్వాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఈ ఘటనపై బాధితుడు సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆగంతుకుడు కర్ణాటక వాసిగా గుర్తించినట్లు ఎస్​ఐ గోవింద్​ తెలిపారు.

ఇవీ చూడండి: ఇంద్రవెల్లి స్ఫూర్తితో గడీల పాలనను పారదోలుదాం: రేవంత్ రెడ్డి

'రాజకీయంగా నష్టమని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.