ETV Bharat / city

పిల్లల భవిష్యత్​ బాగుండాలంటే.. ప్రజలంతా ఏకం కావాలి: చంద్రబాబు

author img

By

Published : Jul 22, 2022, 6:51 PM IST

CBN TOUR: ఏపీ సీఎం జగన్​మోహన్​ రెడ్డి అరాచకాలు ఇలానే కొనసాగిస్తే.. భూమి మీద ఎక్కడా తిరగలేడని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజు ఆయన పర్యటిస్తున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే.. వారి పోరాటానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

పిల్లల భవిష్యత్​ బాగుండాలంటే.. ప్రజలంతా ఏకం కావాలి: చంద్రబాబు
పిల్లల భవిష్యత్​ బాగుండాలంటే.. ప్రజలంతా ఏకం కావాలి: చంద్రబాబు
పిల్లల భవిష్యత్​ బాగుండాలంటే.. ప్రజలంతా ఏకం కావాలి: చంద్రబాబు

CBN TOUR: ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్లలో వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ.. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. వరదల వల్ల సర్వస్వం కోల్పోయామని బాధితులు చంద్రబాబుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తామే ఏటిగట్టు పరిరక్షించుకున్నామని చంద్రబాబుకు స్థానికులు వివరించారు.

సీఎంగా ఉండే అర్హత ఉందా..!: ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల కోసం పని చేసేది తెదేపానేనని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో తుపానులు ఎక్కడ వస్తే అక్కడికే వెళ్లేవాడినని.. జగన్‌ మాత్రం జనాలను బురదలో ఉంచి.. గాలిలో తిరుగుతున్నారని విమర్శించారు. మానవత్వం లేని మనిషికి.. సీఎంగా ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పేదవాడి బాధలు తెలియని వ్యక్తి పదవిలో ఉండాలా అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ఎంతమందిని జైల్లో పెడతారో మేమూ చూస్తామని హెచ్చరించారు. పేదవాడికి అండ.. తెలుగుదేశం పార్టీ జెండా అని కొనియాడారు. బాధితులకు న్యాయం చేసే వరకు తెదేపా వదలదని హెచ్చరించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే.. వారి పోరాటానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రఘురామరాజుపై హత్యాయత్నం: ఈ ప్రభుత్వం పోలవరం పూర్తి చేసే పరిస్థితి లేదని.. అందుకే పోలవరం గోదావరి పాలైందని చంద్రబాబు దుయ్యబట్టారు. పోలవరం పూర్తై ఉంటే.. ఈ పరిస్థితి ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసాపురం ఎంపీ రఘురామను తన ప్రాంతానికీ జగన్‌ రానివ్వట్లేదని.. రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కూడా జరిగిందని ఆరోపించారు. తప్పుడు పనులు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

బాబాకు బంగారు కిరీటం.. 88 ఏళ్ల వయసులో భార్య కోరిక నెరవేర్చిన భర్త..

జాతీయ ఉత్తమ మ్యూజిక్​ డైరెక్టర్​గా తమన్​.. బెస్ట్​ యాక్టర్స్​గా సూర్య, అజయ్​ దేవగణ్​

పిల్లల భవిష్యత్​ బాగుండాలంటే.. ప్రజలంతా ఏకం కావాలి: చంద్రబాబు

CBN TOUR: ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్లలో వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ.. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. వరదల వల్ల సర్వస్వం కోల్పోయామని బాధితులు చంద్రబాబుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తామే ఏటిగట్టు పరిరక్షించుకున్నామని చంద్రబాబుకు స్థానికులు వివరించారు.

సీఎంగా ఉండే అర్హత ఉందా..!: ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల కోసం పని చేసేది తెదేపానేనని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో తుపానులు ఎక్కడ వస్తే అక్కడికే వెళ్లేవాడినని.. జగన్‌ మాత్రం జనాలను బురదలో ఉంచి.. గాలిలో తిరుగుతున్నారని విమర్శించారు. మానవత్వం లేని మనిషికి.. సీఎంగా ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పేదవాడి బాధలు తెలియని వ్యక్తి పదవిలో ఉండాలా అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ఎంతమందిని జైల్లో పెడతారో మేమూ చూస్తామని హెచ్చరించారు. పేదవాడికి అండ.. తెలుగుదేశం పార్టీ జెండా అని కొనియాడారు. బాధితులకు న్యాయం చేసే వరకు తెదేపా వదలదని హెచ్చరించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే.. వారి పోరాటానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రఘురామరాజుపై హత్యాయత్నం: ఈ ప్రభుత్వం పోలవరం పూర్తి చేసే పరిస్థితి లేదని.. అందుకే పోలవరం గోదావరి పాలైందని చంద్రబాబు దుయ్యబట్టారు. పోలవరం పూర్తై ఉంటే.. ఈ పరిస్థితి ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసాపురం ఎంపీ రఘురామను తన ప్రాంతానికీ జగన్‌ రానివ్వట్లేదని.. రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కూడా జరిగిందని ఆరోపించారు. తప్పుడు పనులు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

బాబాకు బంగారు కిరీటం.. 88 ఏళ్ల వయసులో భార్య కోరిక నెరవేర్చిన భర్త..

జాతీయ ఉత్తమ మ్యూజిక్​ డైరెక్టర్​గా తమన్​.. బెస్ట్​ యాక్టర్స్​గా సూర్య, అజయ్​ దేవగణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.