ETV Bharat / city

దీక్ష చేస్తానని తెలిసే.. ఈడబ్ల్యూఎస్​పై సీఎం నిర్ణయం: బండి - తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు నిర్ణయాన్ని స్వాగతించిన బండి

ఈ నెల 27న తాను దీక్ష చేస్తాననే విషయం తెలుసుకొనే... సీఎం కేసీఆర్​ ఈడబ్ల్యూఎస్ అమలుకు నిర్ణయం తీసుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు స్పష్టం చేశారు.

bjp state president bandi sanjay accept cm kcr decission on ews reservations
దీక్ష చేస్తానని తెలిసే.. ఈడబ్ల్యూఎస్​పై సీఎం నిర్ణయం: బండి
author img

By

Published : Jan 21, 2021, 8:18 PM IST

Updated : Jan 22, 2021, 4:41 AM IST

తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా అమలు చేస్తోన్నా, ఓటు బ్యాంకు ఆలోచనతో కేసీఆర్‌ తాత్సారం చేశారని దుయ్యబట్టారు. ఈ నెల 27న 24 గంటల దీక్ష చేయనున్న విషయం సీఎంకి తెలిసినందునే... ఈ నిర్ణయం తీసుకున్నారని... ఇది భాజపా విజయమన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనలు, కమిటీలతో కాపయాపన చేయకుండా అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెరాస ప్రభుత్వానికి భాజపా తడాఖా ఎందో చూపిస్తామని హెచ్చరించారు.

అయోధ్య రామాలయానికి నిధులు ఇవ్వొద్దంటున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు... ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుపతికి వెళ్లి ఎందుకు విరాళం ఇచ్చాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాముడు భాజపా నేత కాదని... హిందువుల ఆరాధ్యదైవమనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే... డీజీపీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణంపై కేసీఆర్​ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

దీక్ష చేస్తానని తెలిసే.. ఈడబ్ల్యూఎస్​పై సీఎం నిర్ణయం: బండి

ఇదీ చూడండి: 'రామమందిర విరాళాలపై ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్లు'

తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా అమలు చేస్తోన్నా, ఓటు బ్యాంకు ఆలోచనతో కేసీఆర్‌ తాత్సారం చేశారని దుయ్యబట్టారు. ఈ నెల 27న 24 గంటల దీక్ష చేయనున్న విషయం సీఎంకి తెలిసినందునే... ఈ నిర్ణయం తీసుకున్నారని... ఇది భాజపా విజయమన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనలు, కమిటీలతో కాపయాపన చేయకుండా అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెరాస ప్రభుత్వానికి భాజపా తడాఖా ఎందో చూపిస్తామని హెచ్చరించారు.

అయోధ్య రామాలయానికి నిధులు ఇవ్వొద్దంటున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు... ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుపతికి వెళ్లి ఎందుకు విరాళం ఇచ్చాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాముడు భాజపా నేత కాదని... హిందువుల ఆరాధ్యదైవమనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే... డీజీపీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణంపై కేసీఆర్​ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

దీక్ష చేస్తానని తెలిసే.. ఈడబ్ల్యూఎస్​పై సీఎం నిర్ణయం: బండి

ఇదీ చూడండి: 'రామమందిర విరాళాలపై ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్లు'

Last Updated : Jan 22, 2021, 4:41 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.