ETV Bharat / city

కేసీఆర్ తప్పుల వల్లే రాష్ట్రానికి రావాల్సిన నీరు రావట్లేదు: డీకే అరుణ

నీటి ప్రాజెక్టుల విషయంలో పాలమూరు ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్​ మోసం చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యుకురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రాజెక్టుల డీపీఆర్​లను మార్చి కాంట్రాక్టులకు మేలు చేశారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కయ్యారని అన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు త్వరతగినా పూర్తి చేయాలని సూచించారు.

author img

By

Published : Oct 7, 2020, 9:40 PM IST

dk aruna
dk aruna

నీటి వివాదాలపై సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. విభజన తర్వాత నీటి విషయంలో తెలంగాణకు నష్టం జరిగిందని ఆరోపించారు. తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారని... ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం 512 టీఎంసీలు దక్కాయని వివరించారు.

కేసీఆర్ చేసిన తప్పుల వల్లే రాష్ట్రానికి రావాల్సిన నీరు రావట్లేదు: డీకే అరుణ

కేంద్రం ట్రైబ్యునల్‌ వేయనందునే అన్యాయం జరిగిందని చెబుతున్నారని... ఏం జరిగినా కేంద్రంపై నెపం నెట్టడం కేసీఆర్​కు అలవాటుగా మారిందని అన్నారు. కేసీఆర్ చేసిన తప్పుల మూలంగానే రాష్ట్రానికి రావాల్సిన నీరు రావట్లేదని ఆరోపించారు. జూరాల పూర్తి చేయకుండా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు అన్యాయం చేశారని డీకే అరుణ మండిపడ్డారు.

ప్రాజెక్టుల విషయంలో జగన్‌తో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఒప్పందం వల్లే పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టులు ముందుకెళ్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారన్నారు. నదీ జలాల పరిష్కారంపై ఉద్దేశపూర్వకంగానే కోర్టులకు వెళ్లారని చెప్పారు. ఏడేళ్లైనా పాలమూరు - రంగారెడ్డి పూర్తికాలేదని... ఇప్పుడు కొత్తగా అలంపూర్-పెద్దమారూర్ గురించి చెబుతున్నారని డీకే అరుణ అన్నారు.

ఇదీ చదవండి : చిన్నారులకు వ్యాక్సినేషన్​లో సత్తా చాటిన తెలంగాణ సర్కారు

నీటి వివాదాలపై సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. విభజన తర్వాత నీటి విషయంలో తెలంగాణకు నష్టం జరిగిందని ఆరోపించారు. తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారని... ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం 512 టీఎంసీలు దక్కాయని వివరించారు.

కేసీఆర్ చేసిన తప్పుల వల్లే రాష్ట్రానికి రావాల్సిన నీరు రావట్లేదు: డీకే అరుణ

కేంద్రం ట్రైబ్యునల్‌ వేయనందునే అన్యాయం జరిగిందని చెబుతున్నారని... ఏం జరిగినా కేంద్రంపై నెపం నెట్టడం కేసీఆర్​కు అలవాటుగా మారిందని అన్నారు. కేసీఆర్ చేసిన తప్పుల మూలంగానే రాష్ట్రానికి రావాల్సిన నీరు రావట్లేదని ఆరోపించారు. జూరాల పూర్తి చేయకుండా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు అన్యాయం చేశారని డీకే అరుణ మండిపడ్డారు.

ప్రాజెక్టుల విషయంలో జగన్‌తో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఒప్పందం వల్లే పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టులు ముందుకెళ్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారన్నారు. నదీ జలాల పరిష్కారంపై ఉద్దేశపూర్వకంగానే కోర్టులకు వెళ్లారని చెప్పారు. ఏడేళ్లైనా పాలమూరు - రంగారెడ్డి పూర్తికాలేదని... ఇప్పుడు కొత్తగా అలంపూర్-పెద్దమారూర్ గురించి చెబుతున్నారని డీకే అరుణ అన్నారు.

ఇదీ చదవండి : చిన్నారులకు వ్యాక్సినేషన్​లో సత్తా చాటిన తెలంగాణ సర్కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.