ETV Bharat / city

కమలనాథుల వరుసమంతనాలు.. స్వతంత్ర పోటీకే ఈటల​ మొగ్గు..!

author img

By

Published : May 26, 2021, 8:20 AM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ భవిష్యత్​ కార్యచరణ చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ అయిన రోజు నుంచి... తమ ప్రియతమ నేత ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడనే ఉత్కంఠతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. తెరాస వ్యతిరేకులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి నాయకత్వం వహిస్తాడని కొందరు అభిప్రాయపడుతుంటే... తాజాగా ఈటలతో కమలనాథుల మంతనాలు మాత్రం కాషాయంవైపు అడుగులు వేస్తాడనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.

bjp leaders invites farmer minister etela in to bjp
bjp leaders invites farmer minister etela in to bjp

మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై కమలదళం దృష్టి పెట్టింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఆయనతో వరస మంతనాలు జరుపుతున్నారు. తన భవిష్యత్‌ కార్యాచరణలో భాగంగా ఈటల వివిధ పార్టీలకు చెందిన నేతలను కొద్దిరోజులుగా కలుస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కొందరు కీలకనేతలు, మాజీ ఎంపీలతో ఈటల ఇటీవల సమావేశమయ్యారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుకుంటున్నానని.. హుజూరాబాద్‌కు వచ్చే ఉపపోరులో భాజపా తనకు మద్దతునివ్వాలని ఈ సందర్భంగా ఈటల వారిని కోరినట్లు సమాచారం. కమలనాథులు మాత్రం తమ పార్టీలో చేరాలని, రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆయనకు వివరిస్తున్నారు.

కలిసి పోరాటం చేద్దాం...

ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌ శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ నివాసంలో మూడు రోజుల క్రితం కొద్దిసేపు సమావేశమయ్యారు. వారం క్రితం ఇద్దరూ ఒకసారి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తన ఆలోచన చెప్పిన ఈటల భాజపా సహకారం కోరినట్లు తెలిసింది. జాతీయపార్టీగా భాజపా పోటీ చేయకుండా ఉండలేదని సంజయ్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. మరో నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం రాష్ట్ర నేతలు, జాతీయ నాయకత్వం అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ‘భాజపాలోకి వస్తే కేసీఆర్‌ ప్రభుత్వంపై కలిసి పోరాటం చేద్దాం. మరోసారి ఆలోచించి మీ నిర్ణయం చెప్పాలని’ అన్నట్లు తెలిసింది. ‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం మంచి నిర్ణయం కాదు, ఉపఎన్నిక వస్తే ఓటమి పాలవుతావు’ అని సీనియర్‌నేత ఒకరు సలహా ఇచ్చారని సమాచారం. సోమవారం రాత్రి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి తన వ్యవసాయ క్షేత్రంలో ఈటలతో సమావేశమై భాజపాలో చేరాలని ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన కీలక నేత ఒకరు పాల్గొన్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నేరుగా అక్కడకు వచ్చి రాజేందర్‌తో మాట్లాడినట్లు తెలిసింది.

అవకాశంగా భావిస్తున్న భాజపా..

ఈటల పార్టీలో చేరితే రాజకీయంగా లాభిస్తుందని భాజపా భావిస్తోంది. ‘దుబ్బాకలో, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలతో రాజకీయంగా జోరందుకున్నాం. కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌, పురపాలక ఎన్నికల్లో ఓటములు ఎదురయ్యాయి. ఈటల భాజపాలో చేరితే అక్కడ విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది.’ అని పార్టీ సీˆనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు.

ఎప్పుడు కలిసేది నిర్ణయించుకోలేదు: కిషన్‌రెడ్డి

ఈటల తనను కలిసేందుకు ప్రయత్నించిన విషయం వాస్తవమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు కలవలేదని స్పష్టంచేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఇష్టాగోష్ఠిగా విలేకరులతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేగా ఈటలతో 15 ఏళ్లు కలిపి పనిచేశాం. ఇద్దరం కలిస్తే తప్పేంటి? ఇరువురి మధ్య భేటీ అయినంతమాత్రాన భాజపాలో చేరిక కోసం చర్చలని అనుకోవద్దు. ఇతర పార్టీల వారిని కలుస్తున్నట్లు, అందులో భాగంగా తనతో కలుస్తానని ఈటల అన్నారని’ కిషన్‌రెడ్డి వివరించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే భాజపా బరిలోకి దిగాలా?వద్దా? అన్నదానిపై పార్టీలో ఇప్పటివరకు చర్చించలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మాజీ మంత్రి ఈటల భాజపాలో చేరుతున్నట్లు ఊహాగానాలు

మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై కమలదళం దృష్టి పెట్టింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఆయనతో వరస మంతనాలు జరుపుతున్నారు. తన భవిష్యత్‌ కార్యాచరణలో భాగంగా ఈటల వివిధ పార్టీలకు చెందిన నేతలను కొద్దిరోజులుగా కలుస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కొందరు కీలకనేతలు, మాజీ ఎంపీలతో ఈటల ఇటీవల సమావేశమయ్యారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుకుంటున్నానని.. హుజూరాబాద్‌కు వచ్చే ఉపపోరులో భాజపా తనకు మద్దతునివ్వాలని ఈ సందర్భంగా ఈటల వారిని కోరినట్లు సమాచారం. కమలనాథులు మాత్రం తమ పార్టీలో చేరాలని, రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆయనకు వివరిస్తున్నారు.

కలిసి పోరాటం చేద్దాం...

ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌ శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ నివాసంలో మూడు రోజుల క్రితం కొద్దిసేపు సమావేశమయ్యారు. వారం క్రితం ఇద్దరూ ఒకసారి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తన ఆలోచన చెప్పిన ఈటల భాజపా సహకారం కోరినట్లు తెలిసింది. జాతీయపార్టీగా భాజపా పోటీ చేయకుండా ఉండలేదని సంజయ్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. మరో నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం రాష్ట్ర నేతలు, జాతీయ నాయకత్వం అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ‘భాజపాలోకి వస్తే కేసీఆర్‌ ప్రభుత్వంపై కలిసి పోరాటం చేద్దాం. మరోసారి ఆలోచించి మీ నిర్ణయం చెప్పాలని’ అన్నట్లు తెలిసింది. ‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం మంచి నిర్ణయం కాదు, ఉపఎన్నిక వస్తే ఓటమి పాలవుతావు’ అని సీనియర్‌నేత ఒకరు సలహా ఇచ్చారని సమాచారం. సోమవారం రాత్రి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి తన వ్యవసాయ క్షేత్రంలో ఈటలతో సమావేశమై భాజపాలో చేరాలని ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన కీలక నేత ఒకరు పాల్గొన్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నేరుగా అక్కడకు వచ్చి రాజేందర్‌తో మాట్లాడినట్లు తెలిసింది.

అవకాశంగా భావిస్తున్న భాజపా..

ఈటల పార్టీలో చేరితే రాజకీయంగా లాభిస్తుందని భాజపా భావిస్తోంది. ‘దుబ్బాకలో, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలతో రాజకీయంగా జోరందుకున్నాం. కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌, పురపాలక ఎన్నికల్లో ఓటములు ఎదురయ్యాయి. ఈటల భాజపాలో చేరితే అక్కడ విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది.’ అని పార్టీ సీˆనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు.

ఎప్పుడు కలిసేది నిర్ణయించుకోలేదు: కిషన్‌రెడ్డి

ఈటల తనను కలిసేందుకు ప్రయత్నించిన విషయం వాస్తవమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు కలవలేదని స్పష్టంచేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఇష్టాగోష్ఠిగా విలేకరులతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేగా ఈటలతో 15 ఏళ్లు కలిపి పనిచేశాం. ఇద్దరం కలిస్తే తప్పేంటి? ఇరువురి మధ్య భేటీ అయినంతమాత్రాన భాజపాలో చేరిక కోసం చర్చలని అనుకోవద్దు. ఇతర పార్టీల వారిని కలుస్తున్నట్లు, అందులో భాగంగా తనతో కలుస్తానని ఈటల అన్నారని’ కిషన్‌రెడ్డి వివరించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే భాజపా బరిలోకి దిగాలా?వద్దా? అన్నదానిపై పార్టీలో ఇప్పటివరకు చర్చించలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మాజీ మంత్రి ఈటల భాజపాలో చేరుతున్నట్లు ఊహాగానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.