ETV Bharat / city

kishan reddy: ఏపీ ప్రభుత్వం భాజపా శ్రేణులను వేధిస్తోంది: కిషన్‌రెడ్డి

author img

By

Published : Aug 19, 2021, 4:33 PM IST

ఏపీలోని విజయవాడలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని స్పష్టం చేశారు. కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని ఆయన ఆక్షేపించారు. ఆర్టికల్‌ 370 అనేది జిన్నా తీసుకువచ్చిన రాజ్యాంగమని.. అందుకే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేసిందన్నారు.

kishan reddy: ఏపీ ప్రభుత్వం భాజపా శ్రేణులను వేధిస్తోంది: కిషన్‌రెడ్డి
kishan reddy: ఏపీ ప్రభుత్వం భాజపా శ్రేణులను వేధిస్తోంది: కిషన్‌రెడ్డి

విజయవాడలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని స్పష్టం చేశారు. అనేక అంశాల్లో ఏపీకి ప్రాధాన్యత కింద నిధులు ఇచ్చామని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఏపీ ప్రభుత్వం భాజపా శ్రేణులను వేధిస్తోంది.

ఏపీకి నిధుల విషయంలో కేంద్రంపై కొందరిది తప్పుడు ప్రచారం. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మవద్దు. కుటుంబ పార్టీలకు వ్యక్తిగత స్వార్థం తప్ప విశాల దృక్పథం ఉండదు. ఏపీ ప్రభుత్వం భాజపా శ్రేణులను వేధిస్తోంది. పార్లమెంట్​లో పనిచేయకుండా మమ్మల్ని అడ్డుకున్నారు.కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది కేంద్రం భావన. కరోనా సమయంలో ఏపీకి 4,500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం పంపింది. రాష్ట్రానికి అనేక విద్యాసంస్థలను మంజూరు చేసింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అభివృద్ధి చేసింది. అందుకే ప్రజల్లోకి వచ్చి జన ఆశీర్వాద యాత్ర చేపట్టాం. - కిషన్‌ రెడ్డి, కేంద్రమంత్రి

పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన తనకు.. పార్టీ అనేక బాధ్యతలు అప్పగించిందన్నారు. గతంలో కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జిగా కూడా పని చేశానని కిషన్​రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆర్టికల్ 370 అంశంపై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఆర్టికల్‌ 370 కోసం పోరాడుతూ నాటి పార్టీ అధ్యక్షుడు బలిదానమయ్యారని అన్నారు.

ఆర్టికల్‌ 370 అనేది జిన్నా తీసుకువచ్చిన రాజ్యాంగం.

కశ్మీర్‌ కోసం పార్టీ కార్యకర్తలు నిరంతరం పోరాటం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370 తొలగిస్తామని హామీ ఇచ్చాం. ఆర్టికల్‌ 370 అనేది జిన్నా తీసుకువచ్చిన రాజ్యాంగం.అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని భాజపా అమలు చేస్తోంది. జిన్నా తీసుకువచ్చిన ఆర్టికల్‌ను కాంగ్రెస్‌ అమలు చేసి కశ్మీర్‌ ప్రజలను బలిచేసింది. అందుకే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేసింది. -కిషన్ రెడ్డి ,కేంద్ర మంత్రి

అందరికి వ్యాక్సిన్లు

‘దేఖో అప్నా దేశ్‌’ పేరుతో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే జనవరి నుంచి డిసెంబరు వరకు పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక రచిస్తున్నామన్నారు. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే ప్రజల సహకారం కావాలన్నారు. వైద్యులను కలిసి వారిలో విశ్వాసం పెంపొందించాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. రాష్ట్రాల పర్యటన సందర్భంగా వైద్యులను కలిసి భరోసా ఇస్తున్నామని వెల్లడించారు. దేశంలో చివరి వ్యక్తి వరకు ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యవేక్షణ కమిటీ నేతృత్వంలో రోజువారీగా సమీక్షలు చేసి రాష్ట్రాలకు వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

కిషన్ రెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

గన్నవరం నుంచి వెన్యూ వేదికకు కిషన్‌రెడ్డి ర్యాలీగా వెళ్లారు. మధ్యలో ట్రాఫిక్‌ జామ్‌ కావటంతో ర్యాలీని పోలీసులు ఆపేశారు. దీంతో పోలీసులు, భాజపా శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి వాహన శ్రేణి మినహా ఇతర వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి:

నేడు విజయవాడలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

విజయవాడలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని స్పష్టం చేశారు. అనేక అంశాల్లో ఏపీకి ప్రాధాన్యత కింద నిధులు ఇచ్చామని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఏపీ ప్రభుత్వం భాజపా శ్రేణులను వేధిస్తోంది.

ఏపీకి నిధుల విషయంలో కేంద్రంపై కొందరిది తప్పుడు ప్రచారం. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మవద్దు. కుటుంబ పార్టీలకు వ్యక్తిగత స్వార్థం తప్ప విశాల దృక్పథం ఉండదు. ఏపీ ప్రభుత్వం భాజపా శ్రేణులను వేధిస్తోంది. పార్లమెంట్​లో పనిచేయకుండా మమ్మల్ని అడ్డుకున్నారు.కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది కేంద్రం భావన. కరోనా సమయంలో ఏపీకి 4,500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం పంపింది. రాష్ట్రానికి అనేక విద్యాసంస్థలను మంజూరు చేసింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అభివృద్ధి చేసింది. అందుకే ప్రజల్లోకి వచ్చి జన ఆశీర్వాద యాత్ర చేపట్టాం. - కిషన్‌ రెడ్డి, కేంద్రమంత్రి

పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన తనకు.. పార్టీ అనేక బాధ్యతలు అప్పగించిందన్నారు. గతంలో కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జిగా కూడా పని చేశానని కిషన్​రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆర్టికల్ 370 అంశంపై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఆర్టికల్‌ 370 కోసం పోరాడుతూ నాటి పార్టీ అధ్యక్షుడు బలిదానమయ్యారని అన్నారు.

ఆర్టికల్‌ 370 అనేది జిన్నా తీసుకువచ్చిన రాజ్యాంగం.

కశ్మీర్‌ కోసం పార్టీ కార్యకర్తలు నిరంతరం పోరాటం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370 తొలగిస్తామని హామీ ఇచ్చాం. ఆర్టికల్‌ 370 అనేది జిన్నా తీసుకువచ్చిన రాజ్యాంగం.అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని భాజపా అమలు చేస్తోంది. జిన్నా తీసుకువచ్చిన ఆర్టికల్‌ను కాంగ్రెస్‌ అమలు చేసి కశ్మీర్‌ ప్రజలను బలిచేసింది. అందుకే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేసింది. -కిషన్ రెడ్డి ,కేంద్ర మంత్రి

అందరికి వ్యాక్సిన్లు

‘దేఖో అప్నా దేశ్‌’ పేరుతో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే జనవరి నుంచి డిసెంబరు వరకు పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక రచిస్తున్నామన్నారు. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే ప్రజల సహకారం కావాలన్నారు. వైద్యులను కలిసి వారిలో విశ్వాసం పెంపొందించాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. రాష్ట్రాల పర్యటన సందర్భంగా వైద్యులను కలిసి భరోసా ఇస్తున్నామని వెల్లడించారు. దేశంలో చివరి వ్యక్తి వరకు ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యవేక్షణ కమిటీ నేతృత్వంలో రోజువారీగా సమీక్షలు చేసి రాష్ట్రాలకు వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

కిషన్ రెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

గన్నవరం నుంచి వెన్యూ వేదికకు కిషన్‌రెడ్డి ర్యాలీగా వెళ్లారు. మధ్యలో ట్రాఫిక్‌ జామ్‌ కావటంతో ర్యాలీని పోలీసులు ఆపేశారు. దీంతో పోలీసులు, భాజపా శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి వాహన శ్రేణి మినహా ఇతర వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి:

నేడు విజయవాడలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.