ETV Bharat / city

నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్​పై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా - హైకోర్టులో రేపు కూడా వాదనలు

ఏపీ మాజీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్​పై నేడు హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని కోర్టుకు తెలిపారు. ఏజీ వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

'ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది'
'ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది'
author img

By

Published : May 7, 2020, 8:25 PM IST

మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్​ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను సమర్ధిస్తూ వాదనలు చేశారు. నిమ్మగడ్డ రమేష్​కుమార్ సహా పలువురు పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వ పరంగా స్పష్టత ఇచ్చారు.

ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు ఏజీ కోర్టుకు వివరించారు. నిమ్మగడ్డ రమేష్​ను ఎస్ఈసీ పదవి నుంచి తొలగించాలనే దురుద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ఎస్​ఈసీ పదవీ కాలాన్ని తగ్గించడం వల్లే రమేశ్ పదవి కోల్పోయారని వాదించారు.

రేపు కూడా కొనసాగనున్న వాదనలు...

ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న ఏజీ... నిమ్మగడ్డ సహా పలువురు వేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్​పై హైకోర్టులో రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.

ఇవీ చూడండి : పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య

మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్​ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను సమర్ధిస్తూ వాదనలు చేశారు. నిమ్మగడ్డ రమేష్​కుమార్ సహా పలువురు పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వ పరంగా స్పష్టత ఇచ్చారు.

ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు ఏజీ కోర్టుకు వివరించారు. నిమ్మగడ్డ రమేష్​ను ఎస్ఈసీ పదవి నుంచి తొలగించాలనే దురుద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ఎస్​ఈసీ పదవీ కాలాన్ని తగ్గించడం వల్లే రమేశ్ పదవి కోల్పోయారని వాదించారు.

రేపు కూడా కొనసాగనున్న వాదనలు...

ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న ఏజీ... నిమ్మగడ్డ సహా పలువురు వేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్​పై హైకోర్టులో రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.

ఇవీ చూడండి : పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.