ETV Bharat / city

Anandaiah political party : రాజకీయ పార్టీ పెడతా : ఆనందయ్య

త్వరలోనే రాజకీయ పార్టీ పెడతామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఆయన.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Nov 30, 2021, 10:49 AM IST

Anandaiah, anandayya, ఆనందయ్య, ఆనందయ్య పార్టీ, ఆనందయ్య రాజకీయ పార్టీ , Anandaiah Party
ఆనందయ్య రాజకీయ పార్టీ

Anandaiah Political Party: కొవిడ్​ రెండో దశలో.. కరోనా నివారణ మందు పేరిట పంపిణీ చేసి గుర్తింపు పొందిన ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. యాదవ సంఘం జాతీయ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ పెట్టనున్నట్లు తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని ఆయన సోమవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందయ్య విలేకరులతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని అన్నారు.

Anandiah Herbal Medicine : కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు తన వద్ద మందు ఉందని, ఏపీ ప్రభుత్వం సహకరిస్తే అందిస్తానని ఆనందయ్య చెప్పారు. కరోనా నివారణ మందు తయారీకి ఏపీ ప్రభుత్వం సహకరించలేదని ఆనందయ్య ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం అఖిల భారతీయ యాదవ మహాసభ 13 జిల్లాల సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనందయ్య మాట్లాడుతూ ఆయుర్వేద మందు పంపిణీ విషయంలో విద్యుత్తు సరఫరాకు అనుమతులు ఇవ్వమని కోరినా ఎన్‌వోసీ రాలేదన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో 13 జిల్లాల్లో రథయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి :

Anandaiah Corona medicine : కరోనా మహమ్మారి భయంతో చాలామంది కృష్ణపట్నం ఆనందయ్య మందు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వేళ ఆనందయ్య మందు తయారీలో బిజీబిజీ అయిపోయారు. మరి ఇంతకీ అసలు కృష్ణపట్నం మందు పంపిణీ ఎలా జరుగుతుంది? అన్ని జిల్లాలవారు ఈ మందు వాడుతున్నారా? లేకుంటే నెల్లూరు జిల్లాకే పరిమితమైందా? మందు తయారీకి, పంపిణీకి ప్రభుత్వం సహకారం ఎలా ఉంది? అసలు ఈ మందు ఎలా వాడాలి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Anandaiah Controversy : దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధాన్ని... తిరుపతి ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ ఆధ్వర్యంలో తయారు చేయాలని తీసుకున్న నిర్ణయంపై తితిదే వెనక్కి తగ్గింది. ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ నుంచి నివేదిక రాగానే... ఔషధ తయారీకి సిద్ధమని తొలుత ప్రకటించిన తితిదే... ఇప్పుడా మందును ఆయుర్వేదంగా పిలవలేమని ఆయుష్ స్పష్టం చేయటంతో పునరాలోచనల్లో పడింది. ఆయుష్ నుంచి గుర్తింపు రాని కారణంగా తమ ఆయుర్వేద ఫార్మసీలో మందుతయారీ కష్టమని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా ముందు నుంచీ ఈ అంశంపై ఆసక్తిని కనబరిచిన తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తేల్చి చెప్పేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Anandaiah Political Party: కొవిడ్​ రెండో దశలో.. కరోనా నివారణ మందు పేరిట పంపిణీ చేసి గుర్తింపు పొందిన ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. యాదవ సంఘం జాతీయ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ పెట్టనున్నట్లు తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని ఆయన సోమవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందయ్య విలేకరులతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని అన్నారు.

Anandiah Herbal Medicine : కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు తన వద్ద మందు ఉందని, ఏపీ ప్రభుత్వం సహకరిస్తే అందిస్తానని ఆనందయ్య చెప్పారు. కరోనా నివారణ మందు తయారీకి ఏపీ ప్రభుత్వం సహకరించలేదని ఆనందయ్య ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం అఖిల భారతీయ యాదవ మహాసభ 13 జిల్లాల సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనందయ్య మాట్లాడుతూ ఆయుర్వేద మందు పంపిణీ విషయంలో విద్యుత్తు సరఫరాకు అనుమతులు ఇవ్వమని కోరినా ఎన్‌వోసీ రాలేదన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో 13 జిల్లాల్లో రథయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి :

Anandaiah Corona medicine : కరోనా మహమ్మారి భయంతో చాలామంది కృష్ణపట్నం ఆనందయ్య మందు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వేళ ఆనందయ్య మందు తయారీలో బిజీబిజీ అయిపోయారు. మరి ఇంతకీ అసలు కృష్ణపట్నం మందు పంపిణీ ఎలా జరుగుతుంది? అన్ని జిల్లాలవారు ఈ మందు వాడుతున్నారా? లేకుంటే నెల్లూరు జిల్లాకే పరిమితమైందా? మందు తయారీకి, పంపిణీకి ప్రభుత్వం సహకారం ఎలా ఉంది? అసలు ఈ మందు ఎలా వాడాలి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Anandaiah Controversy : దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధాన్ని... తిరుపతి ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ ఆధ్వర్యంలో తయారు చేయాలని తీసుకున్న నిర్ణయంపై తితిదే వెనక్కి తగ్గింది. ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ నుంచి నివేదిక రాగానే... ఔషధ తయారీకి సిద్ధమని తొలుత ప్రకటించిన తితిదే... ఇప్పుడా మందును ఆయుర్వేదంగా పిలవలేమని ఆయుష్ స్పష్టం చేయటంతో పునరాలోచనల్లో పడింది. ఆయుష్ నుంచి గుర్తింపు రాని కారణంగా తమ ఆయుర్వేద ఫార్మసీలో మందుతయారీ కష్టమని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా ముందు నుంచీ ఈ అంశంపై ఆసక్తిని కనబరిచిన తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తేల్చి చెప్పేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.