ETV Bharat / city

శ్రీసిటీలో ఆల్​స్టోమ్ ఘనత.. ఎన్ని బోగీలు తయారు చేసిందంటే?

author img

By

Published : Nov 11, 2020, 6:27 PM IST

తిరుపతి శ్రీసిటీలోని ఆల్‌స్టోమ్ పరిశ్రమకు అరుదైన ఘనత దక్కింది. కరోనా ప్రభావంతో పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగినా ఆల్ స్టోమ్ పరిశ్రమలో ఉత్పత్తి కొనసాగుతోంది. పరిశ్రమలో తయారైన మెట్రోరైలు బోగీల సంఖ్య 500కు చేరింది.

శ్రీసిటీలో ఆల్​స్టోమ్ ఘనత.. ఎన్ని బోగీలు తయారు చేసిందంటే?
శ్రీసిటీలో ఆల్​స్టోమ్ ఘనత.. ఎన్ని బోగీలు తయారు చేసిందంటే?

నగరాల మెట్రో ప్రాజెక్టుల కోసం మెట్రోరైలు బోగీలను తయారు చేసే తిరుపతి శ్రీసిటీలోని ఆల్‌స్టోమ్‌ పరిశ్రమ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. 500 మెట్రో రైలు బోగీల ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసింది. ఆసియా-పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద మెట్రోరైలు బోగీల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన ఆల్‌స్టోమ్‌ పరిశ్రమ.. ప్రపంచంలోని సిడ్నీ, మాంట్రియల్‌ నగరాలతోపాటు దేశంలోని చెన్నై, కొచ్చి, లఖ్‌నవూ, ముంబయి నగరాలకు తమ ఉత్పత్తులను అందజేస్తోంది. ఆల్‌స్టోమ్‌లో తయారైన మెట్రో రైలు బోగీలు ప్రపంచ వ్యాప్తంగా 2.70 లక్షల కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై ప్రయాణించినట్లు ఆల్‌స్టోమ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

2012 సంవత్సరంలో చెన్నై మెట్రోరైలు ప్రాజెక్ట్‌ కోసం తమ ఉత్పత్తులను ఆల్‌స్టోమ్‌ సంస్థ శ్రీసిటీలో ప్రారంభించింది. ఏటా 480 మెట్రోబోగీల సామర్థ్యం కలిగిన ఆల్‌స్టోమ్‌ పరిశ్రమ కరోనా ప్రభావం ఉన్న రోజుల్లోనూ మెరుగైన ఉత్పత్తి సాధించింది.

అన్‌లాక్ నేపథ్యంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించిన ఆల్‌స్టామ్‌.. కరోనా అనంతరం తయారైన తొలి రైలు బోగీని కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉన్న రిసో ఎక్స్‌ప్రెస్ మెట్రోపాలిటన్ సంస్థకు అందజేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. శ్రీసిటీలో ఉత్పత్తి అవుతున్న బోగీలు ముంబయి మెట్రో ఆక్వా లైన్, మాంట్రియల్ మెట్రో – రిసో ఎక్స్‌ప్రెస్, సిడ్నీ మెట్రో సంస్థలకు అందజేస్తోంది. ఆల్​స్టోమ్ పరిశ్రమలో పర్యవేక్షకులు, ఇంజినీర్లతోపాటు ఇతర విభాగాల్లో 15 శాతం పైబడి ఉద్యోగులు ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చదవండి: భాజపా 'సంకీర్ణ' మంత్రం- అన్నాడీఎంకే నిరాక'రణం'

నగరాల మెట్రో ప్రాజెక్టుల కోసం మెట్రోరైలు బోగీలను తయారు చేసే తిరుపతి శ్రీసిటీలోని ఆల్‌స్టోమ్‌ పరిశ్రమ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. 500 మెట్రో రైలు బోగీల ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసింది. ఆసియా-పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద మెట్రోరైలు బోగీల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన ఆల్‌స్టోమ్‌ పరిశ్రమ.. ప్రపంచంలోని సిడ్నీ, మాంట్రియల్‌ నగరాలతోపాటు దేశంలోని చెన్నై, కొచ్చి, లఖ్‌నవూ, ముంబయి నగరాలకు తమ ఉత్పత్తులను అందజేస్తోంది. ఆల్‌స్టోమ్‌లో తయారైన మెట్రో రైలు బోగీలు ప్రపంచ వ్యాప్తంగా 2.70 లక్షల కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై ప్రయాణించినట్లు ఆల్‌స్టోమ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

2012 సంవత్సరంలో చెన్నై మెట్రోరైలు ప్రాజెక్ట్‌ కోసం తమ ఉత్పత్తులను ఆల్‌స్టోమ్‌ సంస్థ శ్రీసిటీలో ప్రారంభించింది. ఏటా 480 మెట్రోబోగీల సామర్థ్యం కలిగిన ఆల్‌స్టోమ్‌ పరిశ్రమ కరోనా ప్రభావం ఉన్న రోజుల్లోనూ మెరుగైన ఉత్పత్తి సాధించింది.

అన్‌లాక్ నేపథ్యంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించిన ఆల్‌స్టామ్‌.. కరోనా అనంతరం తయారైన తొలి రైలు బోగీని కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉన్న రిసో ఎక్స్‌ప్రెస్ మెట్రోపాలిటన్ సంస్థకు అందజేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. శ్రీసిటీలో ఉత్పత్తి అవుతున్న బోగీలు ముంబయి మెట్రో ఆక్వా లైన్, మాంట్రియల్ మెట్రో – రిసో ఎక్స్‌ప్రెస్, సిడ్నీ మెట్రో సంస్థలకు అందజేస్తోంది. ఆల్​స్టోమ్ పరిశ్రమలో పర్యవేక్షకులు, ఇంజినీర్లతోపాటు ఇతర విభాగాల్లో 15 శాతం పైబడి ఉద్యోగులు ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చదవండి: భాజపా 'సంకీర్ణ' మంత్రం- అన్నాడీఎంకే నిరాక'రణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.