ETV Bharat / city

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్​ ఎంతకాలం? : సుప్రీంకోర్టు - AB Venkateswara Rao suspension case heard in Supreme Court

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సస్పెన్షన్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఏబీవీపై సస్పెన్షన్‌ ఎంతకాలం కొనసాగిస్తారని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రేపటిలోగా అన్ని వివరాలతో రావాలని ఆదేశించింది.

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్​ ఎంతకాలం?: సుప్రీంకోర్టు
ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్​ ఎంతకాలం?: సుప్రీంకోర్టు
author img

By

Published : Apr 21, 2022, 1:16 PM IST

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సస్పెన్షన్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)పై జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏబీవీపై సస్పెన్షన్‌ ఎంతకాలం కొనసాగిస్తారని ధర్మాసనం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ చేయకూడదన్న నిబంధనలను పరిశీలించాలని సూచించింది.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా.. రెండేళ్ల తర్వాత నిర్దేశాలు అడుగుతారా? అని ప్రశ్నించింది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్‌ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రేపటిలోపు అన్ని వివరాలతో రావాలని.. ఆ తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది.

సంబంధిత కథనాలు..

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సస్పెన్షన్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)పై జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏబీవీపై సస్పెన్షన్‌ ఎంతకాలం కొనసాగిస్తారని ధర్మాసనం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ చేయకూడదన్న నిబంధనలను పరిశీలించాలని సూచించింది.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా.. రెండేళ్ల తర్వాత నిర్దేశాలు అడుగుతారా? అని ప్రశ్నించింది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్‌ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రేపటిలోపు అన్ని వివరాలతో రావాలని.. ఆ తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది.

సంబంధిత కథనాలు..

కొడుకు పుట్టాలని రెండో పెళ్లి.. మొదటి భార్యతో కలిసి ఘాతుకం

సోషల్​ మీడియాలో స్నేహం.. ఆ వీడియోలతో బెదిరించి అత్యాచారం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.