ETV Bharat / city

ఏపీలో కరోనా ఉద్ధృతి... కొత్తగా 11,698 కేసులు, 38 మరణాలు

author img

By

Published : Apr 24, 2021, 6:58 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఏపీ వ్యాప్తంగా 50,972 పరీక్షలు నిర్వహించగా... 11,698 కేసులు నిర్ధరణ అయ్యాయి.

corona cases in ap
ఏపీలో కరోనా ఉద్ధృతి

ఏపీలోని కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 50,972 పరీక్షలు నిర్వహించగా.. 11,698 కేసులు, 37 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 10,20,926 మంది వైరస్‌ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కొవిడ్‌తో తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు చొప్పున.. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నలుగురు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక్కరు చనిపోయారు. ఫలితంగా ఏపీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,616కి చేరింది.

24 గంటల వ్యవధిలో 4,421 మంది బాధితులు కోలుకోవడంతో... కోలుకున్న వారి సంఖ్య 9,31,839కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 81,471 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,59,31,722 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరులో 1,581, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 292 కేసులు నమోదయ్యాయి.

corona cases
ఏపీలో కరోనా ఉద్ధృతి

ఇదీ చదవండి: 'టీకాలు ఉచితంగానే అందిస్తాం'

ఏపీలోని కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 50,972 పరీక్షలు నిర్వహించగా.. 11,698 కేసులు, 37 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 10,20,926 మంది వైరస్‌ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కొవిడ్‌తో తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు చొప్పున.. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నలుగురు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక్కరు చనిపోయారు. ఫలితంగా ఏపీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,616కి చేరింది.

24 గంటల వ్యవధిలో 4,421 మంది బాధితులు కోలుకోవడంతో... కోలుకున్న వారి సంఖ్య 9,31,839కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 81,471 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,59,31,722 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరులో 1,581, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 292 కేసులు నమోదయ్యాయి.

corona cases
ఏపీలో కరోనా ఉద్ధృతి

ఇదీ చదవండి: 'టీకాలు ఉచితంగానే అందిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.