దేశంలోనే మొదటిసారిగా విద్యుత్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మియాపూర్, కంటోన్మెంట్ డిపోల నుంచి 40 బస్సులను నడిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
దేశంలోనే మొదటిసారిగా ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మియాపూర్, కంటోన్మెంట్ డిపోల నుంచి 40 బస్సులను నడిపించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం రెండు సబ్ స్టేషన్లను నిర్మించారు. ఒక్కో సబ్ స్టేషన్లో ఒకేసారి 12 బస్సులకు విద్యుత్ సరఫరా చేసే విధంగా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ బస్సులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు.
