ETV Bharat / business

పుంజుకున్న సూచీలు.. సెన్సెక్స్ 440 ప్లస్.. జీవితకాల కనిష్ఠానికి రూపాయి

author img

By

Published : Jun 23, 2022, 9:52 AM IST

Updated : Jun 23, 2022, 7:54 PM IST

Stock Market LIVE Updates Indices trade higher
Stock Market LIVE Updates Indices trade higher

15:34 June 23

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వాహన రంగ షేర్లు పుంజుకోవడం, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగాలు రాణించడం వల్ల మార్కెట్లు లాభపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 443 పాయింట్లు పుంజుకొని 52,265 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 షేర్లలో ఎన్​టీపీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ మినహా మిగిలిన షేర్లన్నీ లాభాలు గడించాయి. మారుతీ సుజుకీ షేరు విలువ అత్యధికంగా 6 శాతం పెరిగింది. మహీంద్ర అండ్ మహీంద్ర, ఏషియన్ పేంట్స్, భారతీ ఎయిర్​టెల్, టీసీఎస్, సన్​ఫార్మా, విప్రో షేర్లు రాణించాయి.
మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలతో ముగిసింది. 143 పాయింట్లు పుంజుకొని 15,556 వద్ద స్థిరపడింది.

రూపాయి మారకం...
మరోవైపు, రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. బుధవారం 19 పైసలు బలహీనపడిన రూపాయి.. గురువారం ఉదయం 9 పైసలు పుంజుకుంది. ఫలితంగా ఫారిన్ ఎక్స్ఛేంజ్​లో డాలరుతో పోలిస్తే 78.26 వద్దకు చేరింది. అనంతరం, ముడి చమురు ధర ప్రభావంతో ఒత్తిడికి గురైంది. ఓ దశలో 78.38 స్థాయికి పడిపోయిన రూపాయి.. చివరకు సరికొత్త జీవితకాల కనిష్ఠమైన 78.32 వద్ద ముగిసింది.

12:48 June 23

ఒక్కసారిగా పతనం: స్టాక్​ మార్కెట్లలో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఉదయం భారీ లాభాల్లో ట్రేడయిన సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఆరంభంలో దాదాపు 700 పాయింట్లకుపైగా పెరిగిన సెన్సెక్స్​ నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం 51 వేల 800 వద్ద స్థిరంగా ఉంది. నిఫ్టీ 15 వేల 400 వద్ద ట్రేడవుతోంది.

09:45 June 23

లాభాల్లో స్టాక్​ మార్కెట్​ సూచీలు.. 52 వేల ఎగువకు సెన్సెక్స్​

Stock Market LIVE Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ దాదాపు 500 పాయింట్ల లాభంతో 52 వేల 300 ఎగువన కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిప్టీ 150 పాయింట్లకుపైగా పెరిగి.. 15 వేల 560 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. హీరో మోటోకార్ప్​, ఐచర్​ మోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ రాణిస్తున్నాయి. అపోలో హాస్పిటల్​, టైటాన్​ కంపెనీ, ఓఎన్​జీసీ, రిలయన్స్​ నష్టపోయాయి.
ఐటీ, ఆటో రంగాల షేర్ల దూకుడుతో మార్కెట్లు లాభాల దిశగా కొనసాగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఐరోపా మార్కెట్లు బుధవారం నష్టాలను నమోదుచేయడం గమనార్హం. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు కూడా గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 710, నిఫ్టీ 226 పాయింట్లను కోల్పోయాయి.

ఇవీ చూడండి: 'బ్యాంకింగ్​ రంగంలో ఇదే అతిపెద్ద స్కామ్'.. డీహెచ్​ఎఫ్​ఎల్​లో​ రూ.34,615 కోట్ల అవినీతి

పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..

15:34 June 23

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వాహన రంగ షేర్లు పుంజుకోవడం, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగాలు రాణించడం వల్ల మార్కెట్లు లాభపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 443 పాయింట్లు పుంజుకొని 52,265 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 షేర్లలో ఎన్​టీపీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ మినహా మిగిలిన షేర్లన్నీ లాభాలు గడించాయి. మారుతీ సుజుకీ షేరు విలువ అత్యధికంగా 6 శాతం పెరిగింది. మహీంద్ర అండ్ మహీంద్ర, ఏషియన్ పేంట్స్, భారతీ ఎయిర్​టెల్, టీసీఎస్, సన్​ఫార్మా, విప్రో షేర్లు రాణించాయి.
మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలతో ముగిసింది. 143 పాయింట్లు పుంజుకొని 15,556 వద్ద స్థిరపడింది.

రూపాయి మారకం...
మరోవైపు, రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. బుధవారం 19 పైసలు బలహీనపడిన రూపాయి.. గురువారం ఉదయం 9 పైసలు పుంజుకుంది. ఫలితంగా ఫారిన్ ఎక్స్ఛేంజ్​లో డాలరుతో పోలిస్తే 78.26 వద్దకు చేరింది. అనంతరం, ముడి చమురు ధర ప్రభావంతో ఒత్తిడికి గురైంది. ఓ దశలో 78.38 స్థాయికి పడిపోయిన రూపాయి.. చివరకు సరికొత్త జీవితకాల కనిష్ఠమైన 78.32 వద్ద ముగిసింది.

12:48 June 23

ఒక్కసారిగా పతనం: స్టాక్​ మార్కెట్లలో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఉదయం భారీ లాభాల్లో ట్రేడయిన సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఆరంభంలో దాదాపు 700 పాయింట్లకుపైగా పెరిగిన సెన్సెక్స్​ నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం 51 వేల 800 వద్ద స్థిరంగా ఉంది. నిఫ్టీ 15 వేల 400 వద్ద ట్రేడవుతోంది.

09:45 June 23

లాభాల్లో స్టాక్​ మార్కెట్​ సూచీలు.. 52 వేల ఎగువకు సెన్సెక్స్​

Stock Market LIVE Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ దాదాపు 500 పాయింట్ల లాభంతో 52 వేల 300 ఎగువన కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిప్టీ 150 పాయింట్లకుపైగా పెరిగి.. 15 వేల 560 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. హీరో మోటోకార్ప్​, ఐచర్​ మోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ రాణిస్తున్నాయి. అపోలో హాస్పిటల్​, టైటాన్​ కంపెనీ, ఓఎన్​జీసీ, రిలయన్స్​ నష్టపోయాయి.
ఐటీ, ఆటో రంగాల షేర్ల దూకుడుతో మార్కెట్లు లాభాల దిశగా కొనసాగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఐరోపా మార్కెట్లు బుధవారం నష్టాలను నమోదుచేయడం గమనార్హం. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు కూడా గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 710, నిఫ్టీ 226 పాయింట్లను కోల్పోయాయి.

ఇవీ చూడండి: 'బ్యాంకింగ్​ రంగంలో ఇదే అతిపెద్ద స్కామ్'.. డీహెచ్​ఎఫ్​ఎల్​లో​ రూ.34,615 కోట్ల అవినీతి

పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..

Last Updated : Jun 23, 2022, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.