ETV Bharat / business

RBI MPC Meeting Updates : వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం.. మీ EMIపై ప్రభావం ఎంతంటే?

RBI MPC Meeting Updates In Telugu : రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ముఖ్యంగా రెపోరేటును 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో ఆర్​బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు మీ కోసం.

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 10:16 AM IST

Updated : Oct 6, 2023, 11:00 AM IST

rbi interest rate hike news 2023
RBI MPC Meeting Updates

RBI MPC Meeting Updates : ఆర్​బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రెపోరేటును 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎస్​ఎఫ్​, బ్యాంక్ రేట్లను సైతం 6.75 శాతం వద్ద స్థిరంగానే ఉంచింది. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండడం, అంతర్జాతీయంగానూ ప్రతికూలతలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆర్​బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్థిక వృద్ధి బాగానే ఉన్నప్పటికీ..
భారతదేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా అనేక ప్రతికూల అంశాల ప్రభావం మనపై పడుతోంది. ముఖ్యంగా యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీ రేట్లు పెంచే దిశగా అడుగులు వేస్తోంది. దీనితో విదేశీ పెట్టుబడులు భారీగా తరలివెళ్తున్నాయి. మరో వైపు దేశీయ ద్రవ్యోల్బణం కూడా క్రమంగా పెరుగుతోంది. పైగా అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ నేతృత్వంలో జరిగిన పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించడం జరిగింది.

వృద్ధి అంచనాలు

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వృద్ధి అంచనాలు 6.5 శాతంగా ఉంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ పేర్కొన్నారు.
  • ఆగస్టులో వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) 6.83 శాతానికి చేరింది. సెప్టెంబర్​ సీపీఐ అంచనాలు మరో వారం రోజుల్లో రానున్నాయి.​ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం అటుఇటుగా 2 శాతం మార్జిన్​తో సీపీఐను 4 శాతం వద్ద ఉంచాలని ఆర్​బీఐను ఆదేశించడం జరిగింది.
  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిటైల్​ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది.
  • ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతం ఉంది. అయితే వచ్చే ఏడాదికి ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతానికి దిగి వచ్చే అవకాశం ఉందని ఆర్​బీఐ పేర్కొంది.
  • కూరగాయల ధరలు, వంట గ్యాస్​ సిలిండర్ ధరలు తగ్గిన నేపథ్యంలో.. టర్మ్​ ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశం ఉందని శక్తికాంత దాస్​ అభిప్రాయపడ్డారు.
  • ఈ మూడో త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదని శక్తికాంత దాస్​ పేర్కొన్నారు. అయితే ఆకస్మిక ఆహారం, ఇంధన ధరల పెరుగుదల సమస్య ఏర్పడినా.. దానిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
  • దేశీయంగా ఆస్తుల నాణ్యత పెరుగుతున్న నేపథ్యంలో.. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నిలకడగా కొనసాగుతోందని ఆర్​బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఆర్​బీఐ కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఫారెక్స్ నిల్వలు దండిగా ఉన్నాయి!

  • 2023 సెప్టెంబర్​ 29 నాటికి భారతదేశంలో.. ఫారెక్స్ నిల్వలు 586.9 బిలియన్​ డాలర్ల వరకు ఉన్నాయని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​ తెలిపారు.
  • ఆర్​బీఐ.. అర్బన్​ కో-ఆపరేటివ్​ బ్యాంకులకు బుల్లెట్ పేమెంట్ స్కీమ్​ కింద బంగారు రుణాన్ని రెట్టింపు చేసి.. రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
  • ఆర్​బీఐ పేమెంట్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ ఫండ్ స్కీమ్​ను డిసెంబర్​ 2025 వరకు అంటే.. రెండేళ్లు వరకు పొడిగించింది.
  • కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇంటర్నల్​ అంబుడ్స్​మెన్​ స్కీమ్​ను మరింత పటిష్ఠం చేయనున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​ తెలిపారు.

SBI Mobile Handheld Device Service : ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్​.. చిన్న రిక్వెస్ట్​తో​.. ఇంటి వద్దకే బ్యాంకింగ్​ సేవలు..

Gold Rate Today 6th October 2023 : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

RBI MPC Meeting Updates : ఆర్​బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రెపోరేటును 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎస్​ఎఫ్​, బ్యాంక్ రేట్లను సైతం 6.75 శాతం వద్ద స్థిరంగానే ఉంచింది. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండడం, అంతర్జాతీయంగానూ ప్రతికూలతలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆర్​బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్థిక వృద్ధి బాగానే ఉన్నప్పటికీ..
భారతదేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా అనేక ప్రతికూల అంశాల ప్రభావం మనపై పడుతోంది. ముఖ్యంగా యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీ రేట్లు పెంచే దిశగా అడుగులు వేస్తోంది. దీనితో విదేశీ పెట్టుబడులు భారీగా తరలివెళ్తున్నాయి. మరో వైపు దేశీయ ద్రవ్యోల్బణం కూడా క్రమంగా పెరుగుతోంది. పైగా అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ నేతృత్వంలో జరిగిన పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించడం జరిగింది.

వృద్ధి అంచనాలు

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వృద్ధి అంచనాలు 6.5 శాతంగా ఉంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ పేర్కొన్నారు.
  • ఆగస్టులో వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) 6.83 శాతానికి చేరింది. సెప్టెంబర్​ సీపీఐ అంచనాలు మరో వారం రోజుల్లో రానున్నాయి.​ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం అటుఇటుగా 2 శాతం మార్జిన్​తో సీపీఐను 4 శాతం వద్ద ఉంచాలని ఆర్​బీఐను ఆదేశించడం జరిగింది.
  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిటైల్​ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది.
  • ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతం ఉంది. అయితే వచ్చే ఏడాదికి ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతానికి దిగి వచ్చే అవకాశం ఉందని ఆర్​బీఐ పేర్కొంది.
  • కూరగాయల ధరలు, వంట గ్యాస్​ సిలిండర్ ధరలు తగ్గిన నేపథ్యంలో.. టర్మ్​ ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశం ఉందని శక్తికాంత దాస్​ అభిప్రాయపడ్డారు.
  • ఈ మూడో త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదని శక్తికాంత దాస్​ పేర్కొన్నారు. అయితే ఆకస్మిక ఆహారం, ఇంధన ధరల పెరుగుదల సమస్య ఏర్పడినా.. దానిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
  • దేశీయంగా ఆస్తుల నాణ్యత పెరుగుతున్న నేపథ్యంలో.. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నిలకడగా కొనసాగుతోందని ఆర్​బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఆర్​బీఐ కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఫారెక్స్ నిల్వలు దండిగా ఉన్నాయి!

  • 2023 సెప్టెంబర్​ 29 నాటికి భారతదేశంలో.. ఫారెక్స్ నిల్వలు 586.9 బిలియన్​ డాలర్ల వరకు ఉన్నాయని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​ తెలిపారు.
  • ఆర్​బీఐ.. అర్బన్​ కో-ఆపరేటివ్​ బ్యాంకులకు బుల్లెట్ పేమెంట్ స్కీమ్​ కింద బంగారు రుణాన్ని రెట్టింపు చేసి.. రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
  • ఆర్​బీఐ పేమెంట్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ ఫండ్ స్కీమ్​ను డిసెంబర్​ 2025 వరకు అంటే.. రెండేళ్లు వరకు పొడిగించింది.
  • కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇంటర్నల్​ అంబుడ్స్​మెన్​ స్కీమ్​ను మరింత పటిష్ఠం చేయనున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​ తెలిపారు.

SBI Mobile Handheld Device Service : ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్​.. చిన్న రిక్వెస్ట్​తో​.. ఇంటి వద్దకే బ్యాంకింగ్​ సేవలు..

Gold Rate Today 6th October 2023 : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Last Updated : Oct 6, 2023, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.