ETV Bharat / business

51 శాతం తగ్గిన బ్యాంకు మోసాలు.. కానీ అందులో మాత్రం..

author img

By

Published : May 15, 2022, 10:27 PM IST

Bank Frauds in India: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకు మోసాలు తగ్గుముఖం పట్టినట్లు ఆర్​బీఐ తెలిపింది. నగదుపరంగా ప్రభుత్వ బ్యాంకుల్లో మోసాలు 51 శాతం తగ్గాయని వెల్లడించింది. అయితే, సంఖ్యాపరంగా తగ్గుదల ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది.

BANK FRAUDS
BANK FRAUDS

Bank Frauds in India: నగదుపరంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాలు 51 శాతం తగ్గి రూ.40,295.25 కోట్లకు చేరాయని ఆర్‌బీఐ తెలిపింది. 2021-22లో 12 పీఎస్‌బీల్లో కలిపి రూ.40,295.25 కోట్లు మోసానికి గురైనట్లు వెల్లడించింది. చంద్రశేఖర్‌ గౌర్‌ అనే సామాజిక కార్యకర్త 'సమాచార హక్కు చట్టం' కింద కోరిన సమాచారం మేరకు ఆర్‌బీఐ ఈ వివరాలను అందించింది.

Bank frauds RBI report: అయితే, సంఖ్యాపరంగా చూస్తే తగ్గుదల ఆశించిన స్థాయిలో లేదని ఆర్‌బీఐ అందించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2020-21లో 9,933 బ్యాంకు మోసం కేసులు నమోదుకాగా.. 2021-22లో ఆ సంఖ్య 7,940కి పడిపోయాయి. అత్యధికంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో అన్ని విభాగాల్లో కలిపి 431 కేసుల్లో రూ.9,528.95 కోట్ల సొమ్ము మోసానికి గురైంది. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో 4,192 బ్యాంకు మోసాల్లో ఖాతాదారులు రూ.6,932.37 కోట్లు నష్టపోయారు.

Bank Frauds in India: నగదుపరంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాలు 51 శాతం తగ్గి రూ.40,295.25 కోట్లకు చేరాయని ఆర్‌బీఐ తెలిపింది. 2021-22లో 12 పీఎస్‌బీల్లో కలిపి రూ.40,295.25 కోట్లు మోసానికి గురైనట్లు వెల్లడించింది. చంద్రశేఖర్‌ గౌర్‌ అనే సామాజిక కార్యకర్త 'సమాచార హక్కు చట్టం' కింద కోరిన సమాచారం మేరకు ఆర్‌బీఐ ఈ వివరాలను అందించింది.

Bank frauds RBI report: అయితే, సంఖ్యాపరంగా చూస్తే తగ్గుదల ఆశించిన స్థాయిలో లేదని ఆర్‌బీఐ అందించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2020-21లో 9,933 బ్యాంకు మోసం కేసులు నమోదుకాగా.. 2021-22లో ఆ సంఖ్య 7,940కి పడిపోయాయి. అత్యధికంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో అన్ని విభాగాల్లో కలిపి 431 కేసుల్లో రూ.9,528.95 కోట్ల సొమ్ము మోసానికి గురైంది. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో 4,192 బ్యాంకు మోసాల్లో ఖాతాదారులు రూ.6,932.37 కోట్లు నష్టపోయారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.