ETV Bharat / business

ఆయిల్, బంగారంపై కేంద్రం పన్ను బాదుడు.. కానీ...

పెట్రోల్, డీజిల్‌ ఎగుమతులపై ట్యాక్స్​ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ విధించింది. మరోవైపు, బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్నును కేంద్రం.. 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. రూపాయి జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం వల్ల దిగుమతులను కట్టడి చేసేందుకు ఈ చర్య తీసుకున్న‌ట్లు తెలిపింది. పెట్రో ఉత్పత్తులపై పన్ను పెంపు సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా.. దిగుమతి సుంకం పెంపుతో బంగారం ధర పెరిగే అవకాశముంది.

author img

By

Published : Jul 1, 2022, 12:59 PM IST

taxes on petrol and gold
taxes on petrol and gold

Export Tax On Petrol Diesel: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్ను పెంచింది. అలాగే అదనపు విండ్‌ఫాల్ ట్యాక్స్‌ విధించింది. డొమెస్టిక్ రిఫైనరీస్ అర్జించే లాభాలపై ఈ పన్ను పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏటీఎఫ్, పెట్రోల్‌పై ఎగుమతి ట్యాక్స్‌ను లీటరుకు రూ. 6 మేర పెంచింది. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 13 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా దేశీయంగా ఉత్పత్తి చేసిన క్రూడాయిల్‌పై టన్నుకు అదనంగా రూ.23,230 ట్యాక్స్ విధించింది. అయితే ఎక్స్‌పోర్ట్ ఫోకస్డ్ రిఫైనరీస్‌కు మాత్రం ఈ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు లభించింది. అలాగే ఎగుమతిదారులు కచ్చితంగా వారి డీజిల్ ఉత్పత్తిలో 30 శాతాన్ని దేశీయంగా విక్రయించాలనే నిబంధనను తీసుకువచ్చింది కేంద్రం.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్​ ధర భారీగా పడిపోయింది. ఏకంగా 4 శాతానికి పైగా కుప్పకూలింది. 2020 నవంబర్ 2 నుంచి చూస్తే షేర్​ ధర ఇంట్రాడేలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. విండ్‌ఫాల్ ట్యాక్స్ ప్రకటనే ఇందుకు ప్రధాన కారణం. ఓఎన్‌జీసీ కూడా ఇదే దారిలో నడుస్తోంది.
ఈ పన్ను పెంపు నిర్ణయంతో సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్నును కేంద్ర ప్రభుత్వం.. 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. రూపాయి జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం వల్ల దిగుమతులను కట్టడి చేసేందుకు ఈ చర్య తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. కొవిడ్ త‌ర్వాత బంగారం డిమాండ్ పెర‌గ‌డం వల్ల. .భార‌త్‌ 10 ఏళ్లలో దిగుమ‌తి చేసుకున్న దానికంటే గ‌త ఏడాదిలోనే అత్య‌ధికంగా దిగుమతి చేసుకుంది.

ఇదిలా ఉండ‌గా బంగారం అక్రమ రవాణా కట్టడికి.. బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని దేశంలోని ప్రముఖ ఆభరణాల వ్యాపారులు ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వాన్ని కోరారు. దీనికి విరుద్ధంగా ప్ర‌భుత్వం దిగుమ‌తి సుంకాన్ని 5 శాతం మేర పెంచింది. బంగారంపై దిగుమతి సుంకం పెర‌గ‌డం వల్ల ఈ భారం రిటైల్‌ కొనుగోలుదారుల‌పై ప‌డుతుంది. దీంతో బంగారం ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు.. దేశీయ మార్కెట్‌ను బ‌లోపేతం చేసేందుకు చైనా, అమెరికా, సింగపూర్ వంటి దేశాలు బంగారంపై దిగుమతి సుంకాన్ని తొలగించాయి.

ఇవీ చదవండి: నేటి నుంచి ఈ కొత్త మార్పులు అమలు.. అవేంటో తెలుసుకోండి

'జీఎస్​టీ'కి ఐదేళ్లు.. నెలకు రూ.లక్ష కోట్లకు పైగా వసూళ్లు!

Export Tax On Petrol Diesel: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్ను పెంచింది. అలాగే అదనపు విండ్‌ఫాల్ ట్యాక్స్‌ విధించింది. డొమెస్టిక్ రిఫైనరీస్ అర్జించే లాభాలపై ఈ పన్ను పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏటీఎఫ్, పెట్రోల్‌పై ఎగుమతి ట్యాక్స్‌ను లీటరుకు రూ. 6 మేర పెంచింది. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 13 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా దేశీయంగా ఉత్పత్తి చేసిన క్రూడాయిల్‌పై టన్నుకు అదనంగా రూ.23,230 ట్యాక్స్ విధించింది. అయితే ఎక్స్‌పోర్ట్ ఫోకస్డ్ రిఫైనరీస్‌కు మాత్రం ఈ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు లభించింది. అలాగే ఎగుమతిదారులు కచ్చితంగా వారి డీజిల్ ఉత్పత్తిలో 30 శాతాన్ని దేశీయంగా విక్రయించాలనే నిబంధనను తీసుకువచ్చింది కేంద్రం.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్​ ధర భారీగా పడిపోయింది. ఏకంగా 4 శాతానికి పైగా కుప్పకూలింది. 2020 నవంబర్ 2 నుంచి చూస్తే షేర్​ ధర ఇంట్రాడేలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. విండ్‌ఫాల్ ట్యాక్స్ ప్రకటనే ఇందుకు ప్రధాన కారణం. ఓఎన్‌జీసీ కూడా ఇదే దారిలో నడుస్తోంది.
ఈ పన్ను పెంపు నిర్ణయంతో సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్నును కేంద్ర ప్రభుత్వం.. 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. రూపాయి జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం వల్ల దిగుమతులను కట్టడి చేసేందుకు ఈ చర్య తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. కొవిడ్ త‌ర్వాత బంగారం డిమాండ్ పెర‌గ‌డం వల్ల. .భార‌త్‌ 10 ఏళ్లలో దిగుమ‌తి చేసుకున్న దానికంటే గ‌త ఏడాదిలోనే అత్య‌ధికంగా దిగుమతి చేసుకుంది.

ఇదిలా ఉండ‌గా బంగారం అక్రమ రవాణా కట్టడికి.. బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని దేశంలోని ప్రముఖ ఆభరణాల వ్యాపారులు ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వాన్ని కోరారు. దీనికి విరుద్ధంగా ప్ర‌భుత్వం దిగుమ‌తి సుంకాన్ని 5 శాతం మేర పెంచింది. బంగారంపై దిగుమతి సుంకం పెర‌గ‌డం వల్ల ఈ భారం రిటైల్‌ కొనుగోలుదారుల‌పై ప‌డుతుంది. దీంతో బంగారం ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు.. దేశీయ మార్కెట్‌ను బ‌లోపేతం చేసేందుకు చైనా, అమెరికా, సింగపూర్ వంటి దేశాలు బంగారంపై దిగుమతి సుంకాన్ని తొలగించాయి.

ఇవీ చదవండి: నేటి నుంచి ఈ కొత్త మార్పులు అమలు.. అవేంటో తెలుసుకోండి

'జీఎస్​టీ'కి ఐదేళ్లు.. నెలకు రూ.లక్ష కోట్లకు పైగా వసూళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.