ETV Bharat / business

'ఎఫ్​డీఐ'ల వరద.. జీవితకాల గరిష్ఠానికి విదేశీ పెట్టుబడులు

author img

By

Published : May 21, 2022, 4:45 AM IST

FDI inflow all time: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆల్​టైం గరిష్ఠ స్థాయికి చేరాయి. 2021-22లో 83.57 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐ వచ్చినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల ఫలితంగా ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చింది.

FDI inflow all time
FDI inflow all time

FDI inflow India: ఇది వరకెన్నడూ లేనంతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను మన దేశం ఆకర్షించగలిగింది. 2021-22లో ఏకంగా 83.57 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.6.3 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐ వచ్చినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం తెలిపింది. సంస్కరణలతో పాటు సులభతర వాణిజ్యానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇది సాధ్యమైందని పేర్కొంది. 2020-21లో ఇవి 81.97 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

FDI in India 2022: 'కొవిడ్‌, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల చోటుచేసుకున్న సవాళ్ల నేపథ్యంలోనూ విదేశీ పెట్టుబడులు తరలి వచ్చాయి. 2003-04తో పోలిస్తే ఈ పెట్టుబడులు 20 రెట్లు పెరిగాయ’ని పేర్కొంది. 'తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌ వేగంగా మారుతోంద'ని వివరించింది. 2020-21తో పోలిస్తే తయారీ రంగంలోకి ఎఫ్‌డీఐ 76 శాతం పెరిగింది. 'బొగ్గు వెలికితీత, కాంట్రాక్ట్‌ తయారీ, డిజిటల్‌ మీడియా, ఏక బ్రాండ్‌ రిటైల్‌, పౌర విమానయానం, రక్షణ, బీమా, టెలికాం రంగాల్లో సంస్కరణలు చేపట్టడమూ కలిసివచ్చింది' అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అగ్రగామి దేశాలు: మన దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలో 27 శాతం వాటాతో సింగపూర్‌ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా(18%), మారిషస్‌(16%)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ రంగాల్లోకి: కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రంగాలు అత్యధిక పెట్టుబడులను ఆకర్షించగా.. సేవల రంగం, వాహన పరిశ్రమ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ రాష్ట్రాలకు అధికం
మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీల్లో కర్ణాటక అత్యధికంగా 38 శాతం వాటా పొందింది. మహారాష్ట్ర(26%), దిల్లీ(14%) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి:

FDI inflow India: ఇది వరకెన్నడూ లేనంతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను మన దేశం ఆకర్షించగలిగింది. 2021-22లో ఏకంగా 83.57 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.6.3 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐ వచ్చినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం తెలిపింది. సంస్కరణలతో పాటు సులభతర వాణిజ్యానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇది సాధ్యమైందని పేర్కొంది. 2020-21లో ఇవి 81.97 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

FDI in India 2022: 'కొవిడ్‌, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల చోటుచేసుకున్న సవాళ్ల నేపథ్యంలోనూ విదేశీ పెట్టుబడులు తరలి వచ్చాయి. 2003-04తో పోలిస్తే ఈ పెట్టుబడులు 20 రెట్లు పెరిగాయ’ని పేర్కొంది. 'తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌ వేగంగా మారుతోంద'ని వివరించింది. 2020-21తో పోలిస్తే తయారీ రంగంలోకి ఎఫ్‌డీఐ 76 శాతం పెరిగింది. 'బొగ్గు వెలికితీత, కాంట్రాక్ట్‌ తయారీ, డిజిటల్‌ మీడియా, ఏక బ్రాండ్‌ రిటైల్‌, పౌర విమానయానం, రక్షణ, బీమా, టెలికాం రంగాల్లో సంస్కరణలు చేపట్టడమూ కలిసివచ్చింది' అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అగ్రగామి దేశాలు: మన దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలో 27 శాతం వాటాతో సింగపూర్‌ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా(18%), మారిషస్‌(16%)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ రంగాల్లోకి: కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రంగాలు అత్యధిక పెట్టుబడులను ఆకర్షించగా.. సేవల రంగం, వాహన పరిశ్రమ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ రాష్ట్రాలకు అధికం
మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీల్లో కర్ణాటక అత్యధికంగా 38 శాతం వాటా పొందింది. మహారాష్ట్ర(26%), దిల్లీ(14%) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.