ETV Bharat / business

బ్యాంకింగ్, వాహన షేర్లు డీలా- భారీ నష్టాల్లో మార్కెట్లు - సానుకూలంగా సెన్సెక్స్, నిఫ్టీ

STOCKS LIVE
సానుకూలంగా సెన్సెక్స్, నిఫ్టీ
author img

By

Published : Aug 14, 2020, 9:24 AM IST

Updated : Aug 14, 2020, 3:41 PM IST

14:48 August 14

భారీ నష్టాల్లో మార్కెట్లు..

బ్యాంకింగ్​, వాహన రంగాల షేర్లు ఢీలా పడటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 463 పాయింట్ల నష్టంతో 37,847కి పడిపోయింది. నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయి 11,161 పాయింట్లకు చేరుకుంది.  

లాభ నష్టాల్లో..

ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, టాటా స్టీల్, టెక్​మహీంద్రా, ఇన్ఫోసిస్, టైటాన్ లాభాల్లో ఉన్నాయి.  

యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, మారుతి, బజాజ్​ నష్టాల్లో ఉన్నాయి.  

14:07 August 14

బ్యాంకింగ్ షేర్లు ఢీలా

ఆరంభంలో లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు క్రమంగా నష్టాలకు మళ్లాయి. సెన్సెక్స్ 221 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 38,082 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం నష్టాల బాట పట్టింది. 66 పాయింట్లు పతనమై.. 11,234 వద్ద ట్రేడవుతోంది.  

బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్​టెల్ సంస్థల షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. సన్​ఫార్మా, టాటా స్టీల్, ఏషియన్ పేంట్స్, టైటాన్ వాటాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

08:53 August 14

సానుకూలంగా సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్​ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం 38,443 వద్ద కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సైతం లాభాల్లోనే పయనిస్తోంది. 34 పాయింట్లు వృద్ధి చెంది, 11,335 వద్ద ట్రేడవుతోంది.

14:48 August 14

భారీ నష్టాల్లో మార్కెట్లు..

బ్యాంకింగ్​, వాహన రంగాల షేర్లు ఢీలా పడటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 463 పాయింట్ల నష్టంతో 37,847కి పడిపోయింది. నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయి 11,161 పాయింట్లకు చేరుకుంది.  

లాభ నష్టాల్లో..

ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, టాటా స్టీల్, టెక్​మహీంద్రా, ఇన్ఫోసిస్, టైటాన్ లాభాల్లో ఉన్నాయి.  

యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, మారుతి, బజాజ్​ నష్టాల్లో ఉన్నాయి.  

14:07 August 14

బ్యాంకింగ్ షేర్లు ఢీలా

ఆరంభంలో లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు క్రమంగా నష్టాలకు మళ్లాయి. సెన్సెక్స్ 221 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 38,082 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం నష్టాల బాట పట్టింది. 66 పాయింట్లు పతనమై.. 11,234 వద్ద ట్రేడవుతోంది.  

బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్​టెల్ సంస్థల షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. సన్​ఫార్మా, టాటా స్టీల్, ఏషియన్ పేంట్స్, టైటాన్ వాటాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

08:53 August 14

సానుకూలంగా సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్​ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం 38,443 వద్ద కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సైతం లాభాల్లోనే పయనిస్తోంది. 34 పాయింట్లు వృద్ధి చెంది, 11,335 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Aug 14, 2020, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.