ETV Bharat / business

Stock Market: కొత్త గరిష్ఠాలకు సూచీలు- ఐటీ షేర్లు భళా

స్టాక్ మార్కెట్లు లాభాలు గడించాయి. సెన్సెక్స్ (Sensex Today) 167 పాయింట్లు పెరిగి.. తొలిసారి 58,290 పైన స్థిరపడింది. నిఫ్టీ (Nifty Today) 54 పాయింట్లు బలపడి.. జీవనకాల గరిష్ఠమైన 17,350 మార్క్​ దాటింది. ఐటీ, రిలయన్స్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

author img

By

Published : Sep 6, 2021, 3:42 PM IST

Stock market today
నేటి స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర సోమవారం కూడా కొనసాగింది. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 167 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 58,297 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 54 పాయింట్ల లాభంతో తొలిసారి 17,378 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ సానుకూలతలు, రిలయన్స్ ఇండస్ట్రీస్​ వంటి హెవీ వెయిట్​ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఐటీ షేర్లు కూడా భారీ లాభాలను గడించాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 58,515 పాయింట్ల అత్యధిక స్థాయి (నూతన రికార్డు), 58,200 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,429 పాయింట్ల గరిష్ఠ స్థాయి (జీవనకాల గరిష్ఠం), 17,345 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​సీఎల్​ టెక్​, ఇన్ఫోసిస్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు లాభాలను గడించాయి.

ఇండస్​ఇండ్​ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​) భారీగా, కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు సోమవారం లాభాలను గడించాయి.

ఇదీ చదవండి: 100 బిలియన్ డాలర్ల క్లబ్​లోకి ముకేశ్ అంబానీ!

స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర సోమవారం కూడా కొనసాగింది. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 167 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 58,297 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 54 పాయింట్ల లాభంతో తొలిసారి 17,378 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ సానుకూలతలు, రిలయన్స్ ఇండస్ట్రీస్​ వంటి హెవీ వెయిట్​ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఐటీ షేర్లు కూడా భారీ లాభాలను గడించాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 58,515 పాయింట్ల అత్యధిక స్థాయి (నూతన రికార్డు), 58,200 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,429 పాయింట్ల గరిష్ఠ స్థాయి (జీవనకాల గరిష్ఠం), 17,345 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​సీఎల్​ టెక్​, ఇన్ఫోసిస్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు లాభాలను గడించాయి.

ఇండస్​ఇండ్​ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​) భారీగా, కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు సోమవారం లాభాలను గడించాయి.

ఇదీ చదవండి: 100 బిలియన్ డాలర్ల క్లబ్​లోకి ముకేశ్ అంబానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.