అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వాణిజ్యయుద్ధ భయాలు మళ్లీ కమ్ముకోవడమూ నష్టాలకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్ఛ్సేంజి సూచీ- సెన్సెక్స్ 232 పాయింట్ల నష్టంతో 38,072 వద్ద కొనసాగుతోంది . జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజి సూచీ-నిఫ్టీ 55 పాయింట్లు కోల్పోయి 11,304 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో...
ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, ఐటీసీ బజాజ్ ఆటో, ఎస్బీఐ, ఐసీసీ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి.
నష్టాల్లో...
వేదాంత, యాక్సిస్ బ్యాంక్, టాటాస్టీల్, భారతి ఎయిర్టెల్, సన్ఫార్మా, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు కూడా నష్టపోయాయి. యూరప్ వస్తువులపై 7.5 లియన్ డాలర్ల పన్నులు విధించడం వల్ల ఈ రకంగా మార్కెట్లు స్పందించాయి.
రూపాయి...
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 28 పైసలు బలహీన పడి రూ.71.35 వద్ద కొనసాగుతోంది.
- ఇదీ చూడండి: ఏ దేశం వద్ద ఎంత బంగారం నిల్వ ఉందో తెలుసా?