ETV Bharat / business

ఆటో టాప్​ గేర్... బ్యాంకింగ్, ఐటీ రివర్స్ గేర్​

బ్యాంకింగ్​, ఐటీ షేర్ల పతనంతో సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో ముగిసింది. 80 పాయింట్లు కోల్పోయి​ 36,644 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఫ్లాట్​గా ముగిసింది.

author img

By

Published : Sep 5, 2019, 4:41 PM IST

Updated : Sep 29, 2019, 1:22 PM IST

స్టాక్

ఆర్థిక మందగమనంపై భయాలు వెంటాడిన వేళ... స్టాక్​మార్కెట్లు ఆరంభ లాభాలు కోల్పోయి, నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 80 పాయింట్లు తగ్గి 36,644 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ మాత్రం 3 పాయింట్లు లాభపడి 10,848 వద్ద ముగిసింది.

అలా మొదలైనా...

ఉదయం అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా స్పందించాయి. హాంకాంగ్​ బిల్లు ఉపసంహరణ, అమెరికా-చైనా చర్చల పునరుద్ధరణ ప్రకటనల నేపథ్యంలో లాభాలతో రోజును ప్రారంభించాయి. దేశీయ స్టాక్​ మార్కెట్లు అదే బాటలో పయనించాయి.

సంక్షోభంలో ఉన్న వాహన రంగానికి ఊతమిచ్చే చర్యలు ఉంటాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడం ఆటో షేర్ల కొనుగోళ్లకు ఊతమిచ్చింది. అయితే... ఈ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. జీడీపీ వృద్ధి అంచనాలను ప్రముఖ రేటింగ్​ సంస్థ క్రిసిల్​ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపింది. బ్యాంకింగ్, ఐటీ రంగాల వాటాలపై అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ నష్టపోయింది.

లాభనష్టాల్లో...

మారుతి సుజుకి, ఎం అండ్​ ఎం, వేదాంత, టాటా స్టీల్​, బజాజ్ ఆటో, కోల్​ ఇండియా, ఓఎన్​జీసీ, బీపీసీఎల్, ఎస్​ బ్యాంక్​ 7.81 శాతం మేర లాభపడ్డాయి.

కాఫీడే, హెచ్​డీఎఫ్​సీ, ఇండియాబుల్స్​, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్​, కొటక్​ బ్యాంక్ నష్టపోయాయి.

ముడిచమురు ధర బ్యారెల్​కు 60.84 అమెరికా డాలర్లకు చేరుకుంది.

ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కేలా నవ్యావిష్కరణలు'

ఆర్థిక మందగమనంపై భయాలు వెంటాడిన వేళ... స్టాక్​మార్కెట్లు ఆరంభ లాభాలు కోల్పోయి, నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 80 పాయింట్లు తగ్గి 36,644 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ మాత్రం 3 పాయింట్లు లాభపడి 10,848 వద్ద ముగిసింది.

అలా మొదలైనా...

ఉదయం అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా స్పందించాయి. హాంకాంగ్​ బిల్లు ఉపసంహరణ, అమెరికా-చైనా చర్చల పునరుద్ధరణ ప్రకటనల నేపథ్యంలో లాభాలతో రోజును ప్రారంభించాయి. దేశీయ స్టాక్​ మార్కెట్లు అదే బాటలో పయనించాయి.

సంక్షోభంలో ఉన్న వాహన రంగానికి ఊతమిచ్చే చర్యలు ఉంటాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడం ఆటో షేర్ల కొనుగోళ్లకు ఊతమిచ్చింది. అయితే... ఈ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. జీడీపీ వృద్ధి అంచనాలను ప్రముఖ రేటింగ్​ సంస్థ క్రిసిల్​ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపింది. బ్యాంకింగ్, ఐటీ రంగాల వాటాలపై అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ నష్టపోయింది.

లాభనష్టాల్లో...

మారుతి సుజుకి, ఎం అండ్​ ఎం, వేదాంత, టాటా స్టీల్​, బజాజ్ ఆటో, కోల్​ ఇండియా, ఓఎన్​జీసీ, బీపీసీఎల్, ఎస్​ బ్యాంక్​ 7.81 శాతం మేర లాభపడ్డాయి.

కాఫీడే, హెచ్​డీఎఫ్​సీ, ఇండియాబుల్స్​, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్​, కొటక్​ బ్యాంక్ నష్టపోయాయి.

ముడిచమురు ధర బ్యారెల్​కు 60.84 అమెరికా డాలర్లకు చేరుకుంది.

ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కేలా నవ్యావిష్కరణలు'

Gurdaspur (Punjab), Sep 05 (ANI): Families of the victims of Batala firecracker factory blast protested against the Punjab Government on September 5. Death toll in factory blast in Punjab's Gurdaspur rose to 23 while approximately 20 people were injured in the incident. PM Modi also expressed condolences to the families of those who lost their lives. He said, "The tragedy at a firecracker factory in Punjab is heart-wrenching. Deeply anguished due to it. My condolences to families of those who lost their lives. I hope the injured recover at the earliest. Agencies are working on rescue operations at the site of tragedy."

Last Updated : Sep 29, 2019, 1:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.