ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: వరుసగా రెండో సెషన్​లోనూ నష్టాలే

author img

By

Published : Jan 28, 2020, 4:02 PM IST

Updated : Feb 28, 2020, 7:19 AM IST

స్టాక్​మార్కెట్లను నష్టాలు వెంటాడాయి. సెన్సెక్స్​ 188 పాయింట్లు కోల్పోయి 40 వేల 967 వద్ద ముగిసింది. నిఫ్టీ 63 పాయింట్లు పతనమైంది.

sensex-drops-188-dot-26-points-to-end-at-40966
కరోనా ప్రభావంతో వరుసగా రెండో సెషన్​లోనూ నష్టాలే

వరుసగా రెండో సెషన్​లోనూ స్టాక్​మార్కెట్​ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. చైనాను బెంబేలెత్తిస్తోన్న కరోనా కారణంగానే మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆరంభంలో లాభాల్లో కొనసాగినా.. కొద్దిసేపటికే నష్టాల బాట పట్టాయి దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 188 పాయింట్లు పతనమై.. 40 వేల 967 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయింది. చివరకు 12 వేల 56 వద్ద ముగిసింది.

ఐటీ మినహా బ్యాంకింగ్​, ఆటో, ఇన్​ఫ్రా, స్థిరాస్తి, లోహ రంగం షేర్లన్నీ కుదేలయ్యాయి.

ఇవాళ్టి ట్రేడింగ్​లో మొత్తం 985 షేర్లు రాణించాయి. 1511 షేర్లు క్షీణించాయి. 165 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

లాభనష్టాల్లోనివి...

వేదాంత, భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్​, టాటా మోటార్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ డీలాపడ్డాయి.

బీపీసీఎల్​, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఫినాన్స్​, సన్​ ఫార్మా, బజాజ్​ ఫిన్​సర్వ్​ లాభాలను గడించాయి.

అంతర్జాతీయ మార్కెట్లు...

కరోనా ప్రభావం ఆసియా మార్కెట్లపై అధికంగా ఉంది. దక్షిణ కొరియా కోస్పీ సూచీ 3 శాతానికి పైగా కోల్పోయింది. జపాన్​ నిక్కీ కూడా నష్టాలను నమోదు చేసింది.

బ్యారెల్ ముడిచమురు ధర 0.77 శాతం తగ్గి 58.13 డాలర్ల వద్ద స్థిరపడింది.

రూపాయి...

రూపాయి కాస్త పుంజుకుంది. ఇంట్రాడేలో 12 పైసలు వృద్ధి చెందింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ.. ప్రస్తుతం 71.31 వద్ద ఉంది.

వరుసగా రెండో సెషన్​లోనూ స్టాక్​మార్కెట్​ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. చైనాను బెంబేలెత్తిస్తోన్న కరోనా కారణంగానే మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆరంభంలో లాభాల్లో కొనసాగినా.. కొద్దిసేపటికే నష్టాల బాట పట్టాయి దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 188 పాయింట్లు పతనమై.. 40 వేల 967 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయింది. చివరకు 12 వేల 56 వద్ద ముగిసింది.

ఐటీ మినహా బ్యాంకింగ్​, ఆటో, ఇన్​ఫ్రా, స్థిరాస్తి, లోహ రంగం షేర్లన్నీ కుదేలయ్యాయి.

ఇవాళ్టి ట్రేడింగ్​లో మొత్తం 985 షేర్లు రాణించాయి. 1511 షేర్లు క్షీణించాయి. 165 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

లాభనష్టాల్లోనివి...

వేదాంత, భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్​, టాటా మోటార్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ డీలాపడ్డాయి.

బీపీసీఎల్​, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఫినాన్స్​, సన్​ ఫార్మా, బజాజ్​ ఫిన్​సర్వ్​ లాభాలను గడించాయి.

అంతర్జాతీయ మార్కెట్లు...

కరోనా ప్రభావం ఆసియా మార్కెట్లపై అధికంగా ఉంది. దక్షిణ కొరియా కోస్పీ సూచీ 3 శాతానికి పైగా కోల్పోయింది. జపాన్​ నిక్కీ కూడా నష్టాలను నమోదు చేసింది.

బ్యారెల్ ముడిచమురు ధర 0.77 శాతం తగ్గి 58.13 డాలర్ల వద్ద స్థిరపడింది.

రూపాయి...

రూపాయి కాస్త పుంజుకుంది. ఇంట్రాడేలో 12 పైసలు వృద్ధి చెందింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ.. ప్రస్తుతం 71.31 వద్ద ఉంది.

ZCZC
PRI ESPL INT
.MUNICH FES33
GERMANY-VIRUS
German virus patient is case of human-to-human transmission in Germany
         Munich, Jan 28 (AFP) Germany's first confirmed coronavirus patient caught the disease from a Chinese colleague who visited Germany last week, officials said on Tuesday, in the first human-to-human transmission on European soil, according to an AFP          tally.
         The Chinese employee, a woman from Shanghai, "started to feel sick on the flight home on January 23", Andreas Zapf, head of the Bavarian State Office for Health and Food Safety, said at a press conference.
         A 33-year-old German, with whom she had attended a meeting in Bavaria, tested positive for the virus on Monday evening. (AFP)
AMS
01281537
NNNN
Last Updated : Feb 28, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.