పసిడి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.462 పెరిగి 42,339కి చేరుకుంది.
"దిల్లీలో 24 కారెట్ల బంగారం ధర 42వేల మార్కును దాటింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరిగిన వేళ దేశంలో రూ.462 పెరుగుదల నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు తోడైంది. "
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యురిటీస్
వెండి కూడా కిలోకు రూ.1,047 పెరిగి 48,652కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1,606 డాలర్లు ఉండగా.. వెండి 18.32గా ఉంది.