టీవీ రీచార్జ్, ఓటీటీ, పోస్ట్పెయిడ్ సర్వీసులు, యుటిలిటీ ఇలా ఏదో ఒక అవసరానికి ప్రతి నెలా బిల్లు చెల్లిస్తుంటారు చాలా మంది. అయితే వాటి పేమెంట్ తేదీలు మర్చిపోతామేమోనని.. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగిస్తుంటారు. దీని ద్వారా యూజర్ ప్రమేయం లేకుండానే ఆయా బిల్లుల చెల్లింపు జరిగిపోతుంటుంది. అయితే ఇప్పుడు ఆటో డెబిట్ సదుపాయానికి సంబంధించి ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
ఏమిటా కొత్త రూల్స్?
ఆటో డెబిట్ ద్వారా జరిగే బిల్లుల చెల్లింపుల్లో .. ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు రానున్నాయి. రూ.5000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే ఆటో డెబిట్కు ఇకపై ఓటీపీ ఆధారిత నిర్ధరణ తప్పనిసరి చేసింది ఆర్బీఐ.
కొత్త రూల్స్ ప్రకారం ఆటో డెబిట్ షెడ్యూల్ తేదీకి.. ఐదు రోజుల ముందు సంబంధిత బ్యాంక్ నుంచి యూజర్లకు అలర్ట్ వస్తుంది. అప్పుడు వన్ టైమ్ పాస్వర్డ్తో వెరిఫై చేస్తేనే ఆటో డెబిట్ పూర్తవుతుంది. లేదంటే పేమెంట్ పూర్తికాదు. అప్పుడు.. యూజర్లు తమ బిల్లులను మాన్యువల్గా చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి:ఫోన్లో వైరస్.. గుర్తించడం ఎలా?