ETV Bharat / business

'ప్లాట్​ఫార్మ్​ వర్కర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలు'

author img

By

Published : Feb 1, 2021, 1:49 PM IST

ఈ-కామర్స్​, భవన నిర్మాణం తదితర రంగాల్లో పనిచేసే కాంట్రాక్టర్లు, స్వతంత్ర కాంట్రాక్టర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలను అందించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. 2021బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టిన నిర్మల.. వీరి కోసం ఓ ప్రత్యేక పోర్టల్​ను కూడా ప్రతిపాదించారు.

Social security benefit to be extended to platform, gig workers: FM
'ప్లాట్​ఫార్మ్​ వర్కర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలు'

ప్లాట్​ఫార్మ్​, గిగ్​ వర్కర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలను అందించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. వీరికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు పోర్టల్​ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వారికి ఆరోగ్య, ఆర్థిక, ఆహార విషయాల్లో లబ్ధి చేకూర్చేందుకు ఈ పోర్టల్​ ఉపయోగపడుతుందని తెలిపారు. 2021 బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టిన నిర్మల ఈ వ్యాఖ్యలు చేశారు.

ఊబర్​, ఓలా, స్విగ్గి, జొమాటో వంటి ఈ-కామర్స్​ వ్యాపారాల వేదికగా పని చేసే వారిని గిగ్​, ప్లాట్​ఫార్మ్​ వర్కర్లు అని అంటారు. వీరితో పాటు స్వతంత్ర కాంట్రాక్టర్లు, ఆన్​లైన్​ వేదికల్లో పనిచేసే కాంట్రాక్టర్లు, భవన నిర్మాణాల్లో పనిచేసే వారికి కూడా సామాజిక భద్రత ప్రయోజనాలు అందించనున్నట్టు నిర్మల పేర్కొన్నారు.

దేశంలో 50కోట్లమంది ఇందులో పని చేస్తున్నారు. వీరిలో 40కోట్ల మంది అసంఘటిత రంగానికి చేందిన వారే. ఈ రంగంలోని వారికి జీతాలు సరిగా అందని కారణంగా పీఎఫ్​, పింఛను వంటి సామాజిక భద్రతకు దూరంగా ఉన్నారు.

ఇదీ చూడండి:- సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్నుల నుంచి విముక్తి

ప్లాట్​ఫార్మ్​, గిగ్​ వర్కర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలను అందించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. వీరికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు పోర్టల్​ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వారికి ఆరోగ్య, ఆర్థిక, ఆహార విషయాల్లో లబ్ధి చేకూర్చేందుకు ఈ పోర్టల్​ ఉపయోగపడుతుందని తెలిపారు. 2021 బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టిన నిర్మల ఈ వ్యాఖ్యలు చేశారు.

ఊబర్​, ఓలా, స్విగ్గి, జొమాటో వంటి ఈ-కామర్స్​ వ్యాపారాల వేదికగా పని చేసే వారిని గిగ్​, ప్లాట్​ఫార్మ్​ వర్కర్లు అని అంటారు. వీరితో పాటు స్వతంత్ర కాంట్రాక్టర్లు, ఆన్​లైన్​ వేదికల్లో పనిచేసే కాంట్రాక్టర్లు, భవన నిర్మాణాల్లో పనిచేసే వారికి కూడా సామాజిక భద్రత ప్రయోజనాలు అందించనున్నట్టు నిర్మల పేర్కొన్నారు.

దేశంలో 50కోట్లమంది ఇందులో పని చేస్తున్నారు. వీరిలో 40కోట్ల మంది అసంఘటిత రంగానికి చేందిన వారే. ఈ రంగంలోని వారికి జీతాలు సరిగా అందని కారణంగా పీఎఫ్​, పింఛను వంటి సామాజిక భద్రతకు దూరంగా ఉన్నారు.

ఇదీ చూడండి:- సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్నుల నుంచి విముక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.