ETV Bharat / business

కొవిడ్​ 2.0తో రూ.2 లక్షల కోట్ల నష్టం!

author img

By

Published : Jun 17, 2021, 1:34 PM IST

కరోనా రెండో దశ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ 2021-22లో ఇప్పటికే.. రూ.2 లక్షల కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్లు ఆర్​బీఐ అంచనా వేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన నెలవారీ నివేదికలో పలు కీలక విషయాలు పేర్కొంది.

Corona second wave lose in India
కొవిడ్ రెండో దశతో భారత్​కు ఎంత నష్టం

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. రెండో దశ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) నెలవారీ బులెటిన్‌ (జూన్‌-2021)లో పేర్కొంది. చిన్న పట్టణాలు, గ్రామాలకూ వైరస్‌ వ్యాపించడమే ఈ పరిస్థితికి కారణమని తెలిపింది.

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తుందని నివేదిక రూపొందించిన నిపుణులు అభిప్రాయపడ్డారు.

గత సంవత్సరంతో పోలిస్తే కరోనా రెండో దశ వల్ల ఈ ఏడాది కాంటాక్ట్‌లెస్‌ సేవలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగినట్లు ఆర్​బీఐ నివేదిక పేర్కొంది.

రానున్న రోజుల్లో కరోనా రికవరీలు పెరగడం, టీకా పంపిణీ వేగవంతం కావడం వల్ల ఆర్థిక వ్యవస్థ అవరోధాల నుంచి బయటపడేందుకు అవకాశాలున్నాయని ఆర్​బీఐ తెలిపింది. దిగుబడి 2019 రెండో త్రైమాసికం నుంచే దిగజారిందని వెల్లడించింది. ఆర్థిక ఉద్దీపనల వల్ల భారత్​ సర్దుబాటు మార్గంలో పయనిస్తోందని వివరించింది.

ఇదీ చదవండి:జీతం సరిపోవడం లేదా? ఇవి ట్రై చేయండి..

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. రెండో దశ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) నెలవారీ బులెటిన్‌ (జూన్‌-2021)లో పేర్కొంది. చిన్న పట్టణాలు, గ్రామాలకూ వైరస్‌ వ్యాపించడమే ఈ పరిస్థితికి కారణమని తెలిపింది.

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తుందని నివేదిక రూపొందించిన నిపుణులు అభిప్రాయపడ్డారు.

గత సంవత్సరంతో పోలిస్తే కరోనా రెండో దశ వల్ల ఈ ఏడాది కాంటాక్ట్‌లెస్‌ సేవలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగినట్లు ఆర్​బీఐ నివేదిక పేర్కొంది.

రానున్న రోజుల్లో కరోనా రికవరీలు పెరగడం, టీకా పంపిణీ వేగవంతం కావడం వల్ల ఆర్థిక వ్యవస్థ అవరోధాల నుంచి బయటపడేందుకు అవకాశాలున్నాయని ఆర్​బీఐ తెలిపింది. దిగుబడి 2019 రెండో త్రైమాసికం నుంచే దిగజారిందని వెల్లడించింది. ఆర్థిక ఉద్దీపనల వల్ల భారత్​ సర్దుబాటు మార్గంలో పయనిస్తోందని వివరించింది.

ఇదీ చదవండి:జీతం సరిపోవడం లేదా? ఇవి ట్రై చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.