కుటుంబ అత్యవసరాల కోసం లేదా అధిక రాబడులు ఇచ్చే సాధానాల్లో మదుపు చేసేందుకు.. పదవీ విరమణ పొందిన వ్యక్తులు తమ పెన్షన్ నిధి మొత్తాన్ని ఓకే సారి విత్డ్రా చేసుకునేందుకు త్వరలో అనుమతులు లభించే అవకాశం ఉంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. భారత భవిష్యనిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఎన్పీఎస్ నుంచి విత్ డ్రాపై రూ.2 లక్షల వరకు పరిమితి ఉంది. ఇది కాకుండా మొత్తం పెన్షన్ నిధిలో 60 శాతం మాత్రమే విత్డ్రా చేసుకునేందుకు వీలుంది. 40 శాతం ఫండ్ కచ్చితంగా ప్రభుత్వ అనుమతులున్న యాన్యుటీల్లో ఉండాల్సిందే.
కొత్త విధానం ద్వారా రూ.5 లక్షల వరకు పెన్షన్ నిధి ఉన్న సబ్స్క్రైబర్లు ఆ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకునేందుకు అవకాశం కలగనుంది.
విత్డ్రా ప్రణాళికలో మార్పులు వచ్చినప్పటికీ.. సబ్స్క్రైబర్లు తమ పెన్షన్ డబ్బును కొంత ప్రభుత్వ అనుమతులున్న యాన్యుటీల్లో, లేదా పెన్షన్ ఫండ్ మేనేజర్లతో మదుపు చేయించే అవకాశం కల్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.