ETV Bharat / business

పెన్షన్​ నిధి మొత్తం ఒకేసారి విత్​డ్రాకు ఛాన్స్! - జాతీయ పెన్షన్ వ్యవస్థలో కొత్త రూల్స్

పెన్షన్ నిధి విత్​డ్రా నిబంధనల్లో కీలక మార్పులు చేసేందుకు భారత భవిష్యనిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెన్షన్​ నిధి మొత్తాన్ని ఒకేసారి విత్​డ్రా చేసుకునే వెసులుబాటును పెన్షనర్లకు కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం.

PFRDA new rules for Pension Fund withdraw
మొత్తం పెన్షన్ ఒకేసారి విత్​డ్రా
author img

By

Published : May 18, 2021, 5:03 PM IST

కుటుంబ అత్యవసరాల కోసం లేదా అధిక రాబడులు ఇచ్చే సాధానాల్లో మదుపు చేసేందుకు.. పదవీ విరమణ పొందిన వ్యక్తులు తమ పెన్షన్​ నిధి మొత్తాన్ని ఓకే సారి విత్​డ్రా చేసుకునేందుకు త్వరలో అనుమతులు లభించే అవకాశం ఉంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. భారత భవిష్యనిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఎన్​పీఎస్ నుంచి​ విత్​ డ్రాపై రూ.2 లక్షల వరకు పరిమితి ఉంది. ఇది కాకుండా మొత్తం పెన్షన్​ నిధిలో 60 శాతం మాత్రమే విత్​డ్రా చేసుకునేందుకు వీలుంది. 40 శాతం ఫండ్​ కచ్చితంగా ప్రభుత్వ అనుమతులున్న యాన్యుటీల్లో ఉండాల్సిందే.

కొత్త విధానం ద్వారా రూ.5 లక్షల వరకు పెన్షన్​ నిధి ఉన్న సబ్​స్క్రైబర్లు ఆ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకునేందుకు అవకాశం కలగనుంది.

విత్​డ్రా ప్రణాళికలో మార్పులు వచ్చినప్పటికీ.. సబ్​స్క్రైబర్లు తమ పెన్షన్​ డబ్బును కొంత ప్రభుత్వ అనుమతులున్న యాన్యుటీల్లో, లేదా పెన్షన్​ ఫండ్ మేనేజర్లతో మదుపు చేయించే అవకాశం కల్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదీ చదవండి:భారత్​లో గూగుల్ న్యూస్ షోకేస్​- 30 సంస్థలతో డీల్

కుటుంబ అత్యవసరాల కోసం లేదా అధిక రాబడులు ఇచ్చే సాధానాల్లో మదుపు చేసేందుకు.. పదవీ విరమణ పొందిన వ్యక్తులు తమ పెన్షన్​ నిధి మొత్తాన్ని ఓకే సారి విత్​డ్రా చేసుకునేందుకు త్వరలో అనుమతులు లభించే అవకాశం ఉంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. భారత భవిష్యనిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఎన్​పీఎస్ నుంచి​ విత్​ డ్రాపై రూ.2 లక్షల వరకు పరిమితి ఉంది. ఇది కాకుండా మొత్తం పెన్షన్​ నిధిలో 60 శాతం మాత్రమే విత్​డ్రా చేసుకునేందుకు వీలుంది. 40 శాతం ఫండ్​ కచ్చితంగా ప్రభుత్వ అనుమతులున్న యాన్యుటీల్లో ఉండాల్సిందే.

కొత్త విధానం ద్వారా రూ.5 లక్షల వరకు పెన్షన్​ నిధి ఉన్న సబ్​స్క్రైబర్లు ఆ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకునేందుకు అవకాశం కలగనుంది.

విత్​డ్రా ప్రణాళికలో మార్పులు వచ్చినప్పటికీ.. సబ్​స్క్రైబర్లు తమ పెన్షన్​ డబ్బును కొంత ప్రభుత్వ అనుమతులున్న యాన్యుటీల్లో, లేదా పెన్షన్​ ఫండ్ మేనేజర్లతో మదుపు చేయించే అవకాశం కల్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదీ చదవండి:భారత్​లో గూగుల్ న్యూస్ షోకేస్​- 30 సంస్థలతో డీల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.