ETV Bharat / business

కేంద్ర, రాష్ట్రాల అప్పుల్లో భారీ పెరుగుదల

author img

By

Published : Sep 5, 2020, 7:36 AM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు ఈ ఏడాది భారీగా పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ నివేదించింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఆగస్టు నాటికి కేంద్రం రుణాలు 1.72 రెట్లు, రాష్ట్రాల అప్పులు 58.7% మేర పెరిగాయి.

GOVT DEBTS
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు

గతేడాది కన్నా ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు భారీగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం శుక్రవారం నెలవారీ ఆర్థిక పరిస్థితుల నివేదిక విడుదల చేసింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఆగస్టు నాటికి కేంద్రం రుణాలు 1.72 రెట్లు, రాష్ట్రాల అప్పులు 58.7% మేర పెరిగాయి.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వడ్డీలు, ప్రధాన సబ్సిడీల కోసం చేసిన ఖర్చులు 33.7% మేర ఎగబాకాయి. జులై నాటికి ఆర్థిక లోటు రూ.8.2 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి ఆర్థికలోటు బడ్జెట్‌ అంచనాల్లో 77.8% మేర ఉండగా, ఈసారి అది 103.1%కి పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా ఆదాయ వసూళ్లు పడిపోయాయి.

నికర ఆదాయ వసూళ్లు..

నిరుడు ఇదే సమయానికి నికర ఆదాయ వసూళ్లు 20.5% మేర ఉండగా, ఇప్పుడు అవి 12.4%కి తగ్గిపోయాయి. వ్యక్తిగత ఆదాయపన్ను గతేడాది రూ.1.29 లక్షల కోట్ల మేర వసూలుకాగా, ఈసారి అది రూ.91 వేల కోట్లకే పరిమితమైంది. రుణేతర మూలధన(నాన్‌డెట్‌ క్యాపిటల్‌) వసూళ్లు ఇప్పటివరకు కేవలం రూ.5,458 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సమయానికి అవి 14.2% వసూలుకాగా ఇప్పుడు 2.4%కి పడిపోయాయి.

పెరిగిన రెవెన్యూ వ్యయం..

మూలధన వ్యయం ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.12లక్షల కోట్లకే పరిమితమైంది. గత ఏడాది ఈపాటికి బడ్జెట్‌ అంచనాల్లో 31.8% ఖర్చుచేయగా, ఈసారి అది 27.1% వద్దే ఆగిపోయింది. మరోవైపు రెవెన్యూ వ్యయం గత ఏడాదికంటే పెరిగిపోయింది. 2019-20లో ఇదే సమయానికి రెవెన్యూ.. బడ్జెట్‌ వ్యయంలో 34.3% కాగా, ఇప్పుడు అది 35.8% (రూ.9.42 లక్షల కోట్లు)కి చేరింది.

వనరుల పంపిణీలో అప్రమత్తత ముఖ్యం

ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లో 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఆర్థిక వనరులు పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి.. 15వ ఆర్థిక సంఘానికి సూచించింది. శుక్రవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆర్థికసలహామండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌తో మాట్లాడారు. ప్రస్తుతం ఇదివరకు ఎన్నడూలేని అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నందున రాష్ట్రాలకు పన్నులు, ఇతర ఆర్థిక వనరుల పంపిణీ విషయంలో అప్రమత్తత ప్రదర్శించాలని సూచించారు.

ఇదీ చూడండి: సీఐఐ 'మేనిఫెస్టో'లో ఏముంది?

గతేడాది కన్నా ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు భారీగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం శుక్రవారం నెలవారీ ఆర్థిక పరిస్థితుల నివేదిక విడుదల చేసింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఆగస్టు నాటికి కేంద్రం రుణాలు 1.72 రెట్లు, రాష్ట్రాల అప్పులు 58.7% మేర పెరిగాయి.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వడ్డీలు, ప్రధాన సబ్సిడీల కోసం చేసిన ఖర్చులు 33.7% మేర ఎగబాకాయి. జులై నాటికి ఆర్థిక లోటు రూ.8.2 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి ఆర్థికలోటు బడ్జెట్‌ అంచనాల్లో 77.8% మేర ఉండగా, ఈసారి అది 103.1%కి పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా ఆదాయ వసూళ్లు పడిపోయాయి.

నికర ఆదాయ వసూళ్లు..

నిరుడు ఇదే సమయానికి నికర ఆదాయ వసూళ్లు 20.5% మేర ఉండగా, ఇప్పుడు అవి 12.4%కి తగ్గిపోయాయి. వ్యక్తిగత ఆదాయపన్ను గతేడాది రూ.1.29 లక్షల కోట్ల మేర వసూలుకాగా, ఈసారి అది రూ.91 వేల కోట్లకే పరిమితమైంది. రుణేతర మూలధన(నాన్‌డెట్‌ క్యాపిటల్‌) వసూళ్లు ఇప్పటివరకు కేవలం రూ.5,458 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సమయానికి అవి 14.2% వసూలుకాగా ఇప్పుడు 2.4%కి పడిపోయాయి.

పెరిగిన రెవెన్యూ వ్యయం..

మూలధన వ్యయం ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.12లక్షల కోట్లకే పరిమితమైంది. గత ఏడాది ఈపాటికి బడ్జెట్‌ అంచనాల్లో 31.8% ఖర్చుచేయగా, ఈసారి అది 27.1% వద్దే ఆగిపోయింది. మరోవైపు రెవెన్యూ వ్యయం గత ఏడాదికంటే పెరిగిపోయింది. 2019-20లో ఇదే సమయానికి రెవెన్యూ.. బడ్జెట్‌ వ్యయంలో 34.3% కాగా, ఇప్పుడు అది 35.8% (రూ.9.42 లక్షల కోట్లు)కి చేరింది.

వనరుల పంపిణీలో అప్రమత్తత ముఖ్యం

ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లో 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఆర్థిక వనరులు పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి.. 15వ ఆర్థిక సంఘానికి సూచించింది. శుక్రవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆర్థికసలహామండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌తో మాట్లాడారు. ప్రస్తుతం ఇదివరకు ఎన్నడూలేని అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నందున రాష్ట్రాలకు పన్నులు, ఇతర ఆర్థిక వనరుల పంపిణీ విషయంలో అప్రమత్తత ప్రదర్శించాలని సూచించారు.

ఇదీ చూడండి: సీఐఐ 'మేనిఫెస్టో'లో ఏముంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.