ETV Bharat / business

పద్దు​ 2019: అంకురాల ఆశలకు కాస్త దగ్గరగా...

అంకురాలను ప్రోత్సహించటానికి బడ్జెట్​లో కీలక చర్యలు ప్రతిపాదించింది కేంద్రం. పెండింగ్​లో ఉన్న ఆదాయ పన్ను గణన కేసుల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లతోపాటు పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది.

author img

By

Published : Jul 5, 2019, 6:24 PM IST

పద్దు​ 2019: అంకురాల ఆశలకు కాస్త దగ్గరగా...

బడ్జెట్​లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ అంకురాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఏంజెల్​ పన్ను సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అధికారుల వేధింపులుండవు...

పెట్టుబడిదారులు, అంకురాలు డిక్లరేషన్​ ఇచ్చి, రిటర్నులలో పొందుపరిస్తే.. షేర్ల ప్రీమియం విలువపై ఎలాంటి తనిఖీ ఉండదని ప్రకటించారు. పెట్టుబడిదారుల గుర్తింపు కోసం, వారి నుంచి వచ్చే నిధులు మూలాల కోసం ఈ-వెరిఫికేషన్​ వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. ఈ విధానంలో ఆదాయ పన్ను అధికారుల నుంచి తనిఖీలు పేరుతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు ఆర్థికమంత్రి.

పెండింగ్​లో ఉన్న అంకురాల అసెస్​మెంట్​, ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు నిర్మల. ఉన్నతాధికారి అనుమతి లేకుండా అసెసింగ్​ అధికారి విచారణ, వెరిఫికేషన్​ ఉండదని తెలిపారు.

ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్​కు ఊతం...

ప్రస్తుతం క్యాటగిరీ-1 ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లలో ఉన్న వారితో పాటు మరికొందరికి ఇచ్చిన అంకుర షేర్లకు ఫేర్​ మార్కెట్​ విలువను సరిచూడాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపును క్యాటగిరీ-2కు కూడా వర్తింపచేసింది కేంద్రం.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం అంకురాలు ఫేర్​ మార్కెట్​ విలువ కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పొందినట్లయితే అందులో 30 శాతాన్ని పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇదే ఏంజెల్​ పన్ను. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంకురాల నిర్వచనాన్ని మార్చిన కేంద్రం.. ఏంజెల్​ పన్ను మినహాయింపును 25 కోట్లకు పెంచింది. మొత్తం 540 అంకురాలు ఈ మినహాయింపు ద్వారా లబ్ధిపొందాయి.

మూలధన లాభాలు...

అంకురాల్లో పెట్టుబడులు పెట్టటానికి ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బును ఉపయోగిస్తే... మూలధన లాభాలపై విధించే పన్ను నుంచి మినహాయింపును 2021 మార్చి 31 వరకు పొడగించారు. ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలనూ సడలించనున్నట్లు బడ్జెట్​ ప్రసంగంలో తెలిపారు ఆర్థికమంత్రి.

అంకురాల్లో 51 శాతం వాటా, 100 శాతం వాటా కలిగి ఉంటే వచ్చిన నష్టాలను వచ్చే సంవత్సరానికి బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంకురాల్లో ఓటింగ్​ హక్కుల కోసం కావాల్సిన వాటాను 25 శాతానికి తగ్గించారు.

ప్రత్యేక ఛానల్​...

అంకురాలకు సంబంధించి ప్రత్యేక ఛానల్​ తీసుకురానుంది కేంద్రం. ఇది అంకురాలకు సంబంధించి పెట్టుబడిదారులు, వెంచర్​ క్యాపిటలిస్టులు లాంటి వారికి చర్చా వేదికగా ఉండనుంది.

బడ్జెట్​లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ అంకురాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఏంజెల్​ పన్ను సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అధికారుల వేధింపులుండవు...

పెట్టుబడిదారులు, అంకురాలు డిక్లరేషన్​ ఇచ్చి, రిటర్నులలో పొందుపరిస్తే.. షేర్ల ప్రీమియం విలువపై ఎలాంటి తనిఖీ ఉండదని ప్రకటించారు. పెట్టుబడిదారుల గుర్తింపు కోసం, వారి నుంచి వచ్చే నిధులు మూలాల కోసం ఈ-వెరిఫికేషన్​ వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. ఈ విధానంలో ఆదాయ పన్ను అధికారుల నుంచి తనిఖీలు పేరుతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు ఆర్థికమంత్రి.

పెండింగ్​లో ఉన్న అంకురాల అసెస్​మెంట్​, ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు నిర్మల. ఉన్నతాధికారి అనుమతి లేకుండా అసెసింగ్​ అధికారి విచారణ, వెరిఫికేషన్​ ఉండదని తెలిపారు.

ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్​కు ఊతం...

ప్రస్తుతం క్యాటగిరీ-1 ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లలో ఉన్న వారితో పాటు మరికొందరికి ఇచ్చిన అంకుర షేర్లకు ఫేర్​ మార్కెట్​ విలువను సరిచూడాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపును క్యాటగిరీ-2కు కూడా వర్తింపచేసింది కేంద్రం.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం అంకురాలు ఫేర్​ మార్కెట్​ విలువ కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పొందినట్లయితే అందులో 30 శాతాన్ని పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇదే ఏంజెల్​ పన్ను. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంకురాల నిర్వచనాన్ని మార్చిన కేంద్రం.. ఏంజెల్​ పన్ను మినహాయింపును 25 కోట్లకు పెంచింది. మొత్తం 540 అంకురాలు ఈ మినహాయింపు ద్వారా లబ్ధిపొందాయి.

మూలధన లాభాలు...

అంకురాల్లో పెట్టుబడులు పెట్టటానికి ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బును ఉపయోగిస్తే... మూలధన లాభాలపై విధించే పన్ను నుంచి మినహాయింపును 2021 మార్చి 31 వరకు పొడగించారు. ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలనూ సడలించనున్నట్లు బడ్జెట్​ ప్రసంగంలో తెలిపారు ఆర్థికమంత్రి.

అంకురాల్లో 51 శాతం వాటా, 100 శాతం వాటా కలిగి ఉంటే వచ్చిన నష్టాలను వచ్చే సంవత్సరానికి బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంకురాల్లో ఓటింగ్​ హక్కుల కోసం కావాల్సిన వాటాను 25 శాతానికి తగ్గించారు.

ప్రత్యేక ఛానల్​...

అంకురాలకు సంబంధించి ప్రత్యేక ఛానల్​ తీసుకురానుంది కేంద్రం. ఇది అంకురాలకు సంబంధించి పెట్టుబడిదారులు, వెంచర్​ క్యాపిటలిస్టులు లాంటి వారికి చర్చా వేదికగా ఉండనుంది.


New Delhi, July 05 (ANI): Union Finance Minister Nirmala Sitharaman presented the budget for 2019-2020 in the national capital today. While addressing at the Lok Sabha, Nirmala Sitharaman said, "Around 9.6 crore toilets have been constructed since October 02, 2014. More than 5.6 lakh villages have become open defecation free. We have to build on this success. I propose to expand the Swachh Bharat Mission to undertake sustainable sold waste management in every village." "Happy and satisfied to report that India will be made open defecation free on October 02, 2019, as per the dream of PM Modi," she added.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.