ETV Bharat / business

పసిడి పరుగు భవిష్యత్​లోనూ కొనసాగేనా?

author img

By

Published : Jul 14, 2020, 12:13 PM IST

ఇటీవల పసిడిపై పెట్టుబడులు లాభాల పంట పండిస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనా వల్ల స్టాక్ మార్కెట్లపై అనిశ్చితి నెలకొనడం ఇందుకు కారణం. అయితే మార్కెట్లు రికవరీ దిశగా కదలటం ప్రారంభించాయి. మరి ఇప్పుడు పసిడి దారెటు? భవిష్యత్​లో పుత్తడి లాభాలు ఇస్తుందా? విశ్లేషకులు ఏమంటున్నారు?

how safe gold investments
బంగారంపెట్టుబడులు మేలేనా

ప్రపంచమంతా సంక్షోభం నెలకొంది. ఆర్థిక వ్యవస్థలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ఇతర పెట్టుబడి సాధనాలు ఓ కుదుపునకు లోనయ్యాయి. దీని నుంచి ఒక్క బంగారానికి మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా బంగారం మాత్రం భారీగా పుంజుకుంటోంది.

బహుశా ఇందుకేనేమో.. సంక్షోభమంటే పసిడికి చాలా ఇష్టమనే నానుడి కూడా వాడుకలో ఉంది.

సంక్షోభం, పసిడి బంధం..

గత చరిత్రను పరిశీలిస్తే సంక్షోభానికి, పసిడికి ఎలాంటి బంధం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. 2008లోనూ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అప్పుడు ఏ పెట్టుబడి సాధనాలు ఇవ్వనంతగా పసిడి భారీగా రిటర్నులు ఇచ్చింది. ఇప్పుడు అంతకంటే పెద్ద సంక్షోభం ఎదుర్కొంటోంది ప్రపంచం. మళ్లీ ఇప్పుడు కూడా పసిడి భారీ లాభాలు ఇస్తోంది.

కరోనా సంక్షోభం ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తోంది. ఈ నాలుగు నెలల కాలంలో బంగారం ధరలు 17 శాతం పెరిగాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సంక్షోభంలో పసిడి పరుగు ఎలా ఉంటుందో.

సంక్షోభం మాత్రమే కారణమా?

పసిడి ధరల పెరుగుదలకు సంక్షోభం ఒక్కటే కారణం కాదంటున్నారు నిపుణులు. కరెన్సీ బలహీన పడటం కూడా ఇటీవల పసిడి రికార్డు స్థాయిలను తాకేందుకు కారణంగా చెబుతున్నారు ఐఐఎం(అహ్మదాబాద్) గోల్డ్ పాలసీ సెంటర్ అధిపతి సుధీశ్ నంబియత్.

అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవటం, డాలర్ విలువ తగ్గటం వంటి పరిణామాలు ఉన్నా పసిడి ధరలు భారీగా పెరగటం వల్ల స్టాక్ మార్కెట్లు, కరెన్సీ, బంగారం మధ్య ఉండే పరస్పర సంబంధం దెబ్బతిన్నట్లు ఆయన విశ్లేషిస్తున్నారు.

పసిడి వృద్ధి ఇలా..

గత ఏడాది జూన్​తో పోలిస్తే ఇప్పటి వరకు బంగారం 24 శాతం, ఏడాది మొత్తం మీద చూస్తే 40 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్​ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర జులై 1న రికార్డ్ స్థాయిలో రూ.48,589కి చేరింది. ఈ స్థాయికి ధర పెరిగిన నేపథ్యంలో చాలా మంది లాభాల స్వీకరణకు కుడా దిగారు.

అంతర్జాతీయంగా చూస్తే గత వారం ఔన్సు బంగారం ధర రూర.1,788.96 డాలర్లను తాకింది. 2012 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో ధర పెరగటం మళ్లీ ఇదే ప్రథమం.

భవిష్యత్ అంచనాలు..

ఇటీవల పసిడి పరుగుల నేపథ్యంలో.. బంగారం ధరలపై గతంలో విడుదల చేసిన 12 నెలల అంచనాలను సవరించింది గోల్డ్​మన్ శాక్స్. తాజా అంచనాల ప్రకారం బంగారం ఔన్సుకు 1,800 డాలర్ల నుంచి 2,000 డాలర్ల స్థాయిని తాకొచ్చని తెలిపింది.

మరో దిగ్గజ సంస్థ అమెరికా సెక్యూరిటీస్​ కూడా బంగారం ధరలు 2021లో ఔన్సుకు 2,000 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు పెరగొచ్చని తెలిపింది. దేశీయ బ్రోకరేజీ సంస్థలు కూడా ఈ ఏడాది బంగారం ధరలు ఇంకా పెరగొచ్చని అంచనా వేస్తున్నాయి.

రికార్డు స్థాయిల వద్దకు పసిడి ధరలు చేరిన కారణంగా స్వల్పకాలంలో కాస్త దిద్దుబాటుకు లోనవ్వొచ్చని దేశీయ సంస్థలు అంటున్నాయి. అయితే దీర్ఘ కాలంలో మాత్రం భారీగా లాభాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నాయి.

మంచి లాభాల కోసం మదుపరులు బంగారాన్ని ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. లాక్​డౌన్ నిబంధనలు, భారీగా పెరిగిన ధరలతో నగల రూపంలో బంగారం కొనడం తగ్గినప్పటికీ.. ఈటీఎఫ్​లో మాత్రం భారీగా పెట్టుబడులు పెరిగినట్లు చెబుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్​లలో పెట్టుబడులకు ఏప్రిల్​లో రూ.731 కోట్లు వస్తే.. మేలో రూ.815 కోట్లు వచ్చాయి. పసిడిపై పెట్టుబడులు సానుకూలంగా ఉన్నట్లు తెలిపేందుకు ఇవే నిదర్శనమంటున్నారు.

భౌతికంగా బంగారం డిమాండ్​ తగ్గినా.. ఆ ప్రభావం ఈటీఎఫ్​పై అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:కరోనా కాలంలో అప్పు కావాలా? సులువైన మార్గాలివే..

ప్రపంచమంతా సంక్షోభం నెలకొంది. ఆర్థిక వ్యవస్థలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ఇతర పెట్టుబడి సాధనాలు ఓ కుదుపునకు లోనయ్యాయి. దీని నుంచి ఒక్క బంగారానికి మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా బంగారం మాత్రం భారీగా పుంజుకుంటోంది.

బహుశా ఇందుకేనేమో.. సంక్షోభమంటే పసిడికి చాలా ఇష్టమనే నానుడి కూడా వాడుకలో ఉంది.

సంక్షోభం, పసిడి బంధం..

గత చరిత్రను పరిశీలిస్తే సంక్షోభానికి, పసిడికి ఎలాంటి బంధం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. 2008లోనూ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అప్పుడు ఏ పెట్టుబడి సాధనాలు ఇవ్వనంతగా పసిడి భారీగా రిటర్నులు ఇచ్చింది. ఇప్పుడు అంతకంటే పెద్ద సంక్షోభం ఎదుర్కొంటోంది ప్రపంచం. మళ్లీ ఇప్పుడు కూడా పసిడి భారీ లాభాలు ఇస్తోంది.

కరోనా సంక్షోభం ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తోంది. ఈ నాలుగు నెలల కాలంలో బంగారం ధరలు 17 శాతం పెరిగాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సంక్షోభంలో పసిడి పరుగు ఎలా ఉంటుందో.

సంక్షోభం మాత్రమే కారణమా?

పసిడి ధరల పెరుగుదలకు సంక్షోభం ఒక్కటే కారణం కాదంటున్నారు నిపుణులు. కరెన్సీ బలహీన పడటం కూడా ఇటీవల పసిడి రికార్డు స్థాయిలను తాకేందుకు కారణంగా చెబుతున్నారు ఐఐఎం(అహ్మదాబాద్) గోల్డ్ పాలసీ సెంటర్ అధిపతి సుధీశ్ నంబియత్.

అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవటం, డాలర్ విలువ తగ్గటం వంటి పరిణామాలు ఉన్నా పసిడి ధరలు భారీగా పెరగటం వల్ల స్టాక్ మార్కెట్లు, కరెన్సీ, బంగారం మధ్య ఉండే పరస్పర సంబంధం దెబ్బతిన్నట్లు ఆయన విశ్లేషిస్తున్నారు.

పసిడి వృద్ధి ఇలా..

గత ఏడాది జూన్​తో పోలిస్తే ఇప్పటి వరకు బంగారం 24 శాతం, ఏడాది మొత్తం మీద చూస్తే 40 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్​ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర జులై 1న రికార్డ్ స్థాయిలో రూ.48,589కి చేరింది. ఈ స్థాయికి ధర పెరిగిన నేపథ్యంలో చాలా మంది లాభాల స్వీకరణకు కుడా దిగారు.

అంతర్జాతీయంగా చూస్తే గత వారం ఔన్సు బంగారం ధర రూర.1,788.96 డాలర్లను తాకింది. 2012 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో ధర పెరగటం మళ్లీ ఇదే ప్రథమం.

భవిష్యత్ అంచనాలు..

ఇటీవల పసిడి పరుగుల నేపథ్యంలో.. బంగారం ధరలపై గతంలో విడుదల చేసిన 12 నెలల అంచనాలను సవరించింది గోల్డ్​మన్ శాక్స్. తాజా అంచనాల ప్రకారం బంగారం ఔన్సుకు 1,800 డాలర్ల నుంచి 2,000 డాలర్ల స్థాయిని తాకొచ్చని తెలిపింది.

మరో దిగ్గజ సంస్థ అమెరికా సెక్యూరిటీస్​ కూడా బంగారం ధరలు 2021లో ఔన్సుకు 2,000 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు పెరగొచ్చని తెలిపింది. దేశీయ బ్రోకరేజీ సంస్థలు కూడా ఈ ఏడాది బంగారం ధరలు ఇంకా పెరగొచ్చని అంచనా వేస్తున్నాయి.

రికార్డు స్థాయిల వద్దకు పసిడి ధరలు చేరిన కారణంగా స్వల్పకాలంలో కాస్త దిద్దుబాటుకు లోనవ్వొచ్చని దేశీయ సంస్థలు అంటున్నాయి. అయితే దీర్ఘ కాలంలో మాత్రం భారీగా లాభాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నాయి.

మంచి లాభాల కోసం మదుపరులు బంగారాన్ని ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. లాక్​డౌన్ నిబంధనలు, భారీగా పెరిగిన ధరలతో నగల రూపంలో బంగారం కొనడం తగ్గినప్పటికీ.. ఈటీఎఫ్​లో మాత్రం భారీగా పెట్టుబడులు పెరిగినట్లు చెబుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్​లలో పెట్టుబడులకు ఏప్రిల్​లో రూ.731 కోట్లు వస్తే.. మేలో రూ.815 కోట్లు వచ్చాయి. పసిడిపై పెట్టుబడులు సానుకూలంగా ఉన్నట్లు తెలిపేందుకు ఇవే నిదర్శనమంటున్నారు.

భౌతికంగా బంగారం డిమాండ్​ తగ్గినా.. ఆ ప్రభావం ఈటీఎఫ్​పై అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:కరోనా కాలంలో అప్పు కావాలా? సులువైన మార్గాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.