ETV Bharat / business

విదేశీ చెల్లింపులు 7 లక్షలు దాటితే 5% పన్ను

విదేశాలకు పంపే డబ్బుపై ఇక నుంచి 5 శాతం పన్ను వసూలు (టీసీఎస్​) చేయనుంది కేంద్రం. ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలు దాటితే అదనపు మొత్తానికి టీసీఎస్​ అమలు చేస్తారు. ఈ నిబంధనలు అక్టోబర్​ 1 నుంచి అమలవుతాయి.

author img

By

Published : Sep 10, 2020, 5:12 PM IST

Foreign
విదేశీ చెల్లింపులు

విదేశాలకు పంపే డబ్బుపై మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్​)ను ప్రవేశపెట్టింది కేంద్రం. ఆర్థిక సంవత్సరంలో విదేశీ చెల్లింపులు రూ.7 లక్షలకు మించితే అదనపు మొత్తంపై టీసీఎస్​ అమలు చేస్తారు. ఈ నిబంధనలు అక్టోబర్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

అయితే, విదేశీ పర్యటనల (ఓవర్సీస్ టూర్​ ప్రోగ్రామ్​ ప్యాకేజీ) చేసే ఖర్చు మొత్తానికి టీసీఎస్​ వర్తిస్తుంది. 'ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజీ' అంటే ఇతర దేశం/దేశాలు/ భూభాగం/ భూభాగాల పర్యటనలుగా నిర్వచిస్తారు. అంతేకాకుండా.. ఇందులో ప్రయాణ/హోటల్ బస/బోర్డింగ్/ ఇతర ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

వారికి 10 శాతం..

ఇలా.. విదేశీ చెల్లింపులు రూ.7 లక్షలు దాటితే అదనపు మొత్తం, విదేశీ పర్యటనల మొత్తం ఖర్చుపై 5 శాతం పన్ను వసూలు చేస్తారు. ఈ బాధ్యతను ఆర్​బీఐ పరిధిలోని సరళీకృత చెల్లింపుల పథకం(ఎల్​ఆర్​ఎస్​) నిర్వహిస్తుంది. ఆధార్, పాన్​ లేని పక్షంలో పన్ను రేటు 10 శాతంగా ఉంటుంది.

కానీ, ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి పొందిన విద్యారుణం పంపించే సందర్భాల్లో.. రూ .7 లక్షలకు మించిన మొత్తంపై టీసీఎస్​ రేటు 0.5 శాతం ఉంటుంది.

ఆర్థిక చట్టం ద్వారా..

ఎల్​ఆర్​ఎస్​ నిబంధనల ప్రకారం.. ఏటా గరిష్ఠంగా 2.5 లక్షల డాలర్లను విదేశాలకు పంపే అవకాశం ఉంది. విదేశీ చెల్లింపులపై పన్ను వసూలును చేయటాన్ని ఆర్థిక చట్టం-2020లో ప్రవేశపెట్టారు. దీనికి మార్చి 27న ఆమోదం లభించింది.

ఇదీ చూడండి: 'రుణ గ్రహీతలకు సుప్రీం మరింత ఉపశమనం'

విదేశాలకు పంపే డబ్బుపై మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్​)ను ప్రవేశపెట్టింది కేంద్రం. ఆర్థిక సంవత్సరంలో విదేశీ చెల్లింపులు రూ.7 లక్షలకు మించితే అదనపు మొత్తంపై టీసీఎస్​ అమలు చేస్తారు. ఈ నిబంధనలు అక్టోబర్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

అయితే, విదేశీ పర్యటనల (ఓవర్సీస్ టూర్​ ప్రోగ్రామ్​ ప్యాకేజీ) చేసే ఖర్చు మొత్తానికి టీసీఎస్​ వర్తిస్తుంది. 'ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజీ' అంటే ఇతర దేశం/దేశాలు/ భూభాగం/ భూభాగాల పర్యటనలుగా నిర్వచిస్తారు. అంతేకాకుండా.. ఇందులో ప్రయాణ/హోటల్ బస/బోర్డింగ్/ ఇతర ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

వారికి 10 శాతం..

ఇలా.. విదేశీ చెల్లింపులు రూ.7 లక్షలు దాటితే అదనపు మొత్తం, విదేశీ పర్యటనల మొత్తం ఖర్చుపై 5 శాతం పన్ను వసూలు చేస్తారు. ఈ బాధ్యతను ఆర్​బీఐ పరిధిలోని సరళీకృత చెల్లింపుల పథకం(ఎల్​ఆర్​ఎస్​) నిర్వహిస్తుంది. ఆధార్, పాన్​ లేని పక్షంలో పన్ను రేటు 10 శాతంగా ఉంటుంది.

కానీ, ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి పొందిన విద్యారుణం పంపించే సందర్భాల్లో.. రూ .7 లక్షలకు మించిన మొత్తంపై టీసీఎస్​ రేటు 0.5 శాతం ఉంటుంది.

ఆర్థిక చట్టం ద్వారా..

ఎల్​ఆర్​ఎస్​ నిబంధనల ప్రకారం.. ఏటా గరిష్ఠంగా 2.5 లక్షల డాలర్లను విదేశాలకు పంపే అవకాశం ఉంది. విదేశీ చెల్లింపులపై పన్ను వసూలును చేయటాన్ని ఆర్థిక చట్టం-2020లో ప్రవేశపెట్టారు. దీనికి మార్చి 27న ఆమోదం లభించింది.

ఇదీ చూడండి: 'రుణ గ్రహీతలకు సుప్రీం మరింత ఉపశమనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.