ETV Bharat / business

బైడెన్ రాకతో ద్వైపాక్షిక వాణిజ్య బంధం బలపడేనా?

author img

By

Published : Nov 15, 2020, 9:35 AM IST

కొన్నాళ్లుగా భారత్-అమెరికాల ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా భారత్​కు అమెరికా జీఎస్​పీ హోదాను రద్దు చేయడం.. అందుకు భారత్​ ప్రతీకార చర్యలకు దిగటం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరి బైడెన్ రాకతో ఇరు దేశాల వాణిజ్యం మెరుగవుతుందా? ఇరు దేశాల వాణిజ్యంపై బైడెన్ ప్రభావం ఎలా ఉండనుంది?

Will India-US trade ties improve with Biden's arrival
బైడన్ రాకతో వాణిజ్య బంధాలు మెరుగయ్యేనా

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్ వచ్చే ఏడాది నుంచి పాలన సాగించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానంలో బైడెన్ అగ్రరాజ్య పీఠమెక్కుతున్న నేపథ్యంలో చాలా దేశాలు వాణిజ్య పరంగా భారీ మార్పులు రావచ్చని అంచనాలు వేసుకుంటున్నాయి. మరి భారత్ విషయంలో ఈ అంచనాలు ఎలా ఉన్నాయి? బైడెన్ అధికారంలోకి వస్తే భారత్​-అమెరికా వాణిజ్య బంధాలు మెరుగవుతాయా? అనే అంశంపై నిపుణుల విశ్లేషణలు ఇలా ఉన్నాయి.

బైడెన్ అధ్యక్ష పదవిలోకి వచ్చినా.. అమెరికాతో వాణిజ్యం విషయంలో భారత్ పెద్ద మార్పులను ఆశించడలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వరల్డ్ ట్రేడ్​ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) భారత మాజీ అంబాసిడర్​ జయంత్​ దాస్​ గుప్తా ఈ అంశంపై 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

'డెమొక్రాట్లు, రిపబ్లికన్లు రెండు పార్టీల అధ్యక్షుల పాలనల్లోనూ భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు బలహీన పడుతూ వచ్చాయి. ఇప్పుడు బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టాక భారత్​తో వాణిజ్యం విషయంలో అమెరికా వైఖరిలో పెద్ద మార్పు ఉంటుందని అనుకోవడం లేదు' అని జయంత్ అభిప్రాయపడ్డారు.

ఇరు దేశాల వాణిజ్యం ఇలా..

భారత్-అమెరికాల ద్వైపాక్షిక వాణిజ్యం 2000 సంవత్సరంలో 19 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2018 నాటికి అది 142 బిలియన్ డాలర్లకు పెరిగింది. అది ఈ ఏడాది 150 బిలియన్​ డాలర్లు దాటుతుందని అంచనా. ఏదేమైనప్పటికీ.. ఇరు దేశాధినేతలు జాతీయ ఆర్థిక విధానాలను పాటింస్తుండటం వల్ల కొన్నాళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ప్రతీకార చర్యలు..

కొన్నాళ్లుగా ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య అంశాల్లో విబేధాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు అమెరికా బహిరంగంగానే భారత్​పై కోపాన్ని వ్యక్తం చేసింది. సుంకాల పెంపు, మేధో సంపత్తి హక్కులు వంటి పరిణామాలే ఇందుకు ఉదాహరణ.

ఇందులో భాగంగా భారత్​ సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియం వంటి లోహాలపై సుంకాలు విధిస్తూ ట్రంప్ యంత్రాంగం 2018లో నిర్ణయం తీసుకుంది. భారత్​కు గత ఏడాది ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్​పీ) కూడా రద్దు చేసింది. ఈ నిర్ణయాలకు బదులుగా 1.3 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఎగుమతులపై సుంకాలపెంపుతో భారత్ ప్రతీకార చర్యకు దిగింది.

'ట్రంప్ పాలనలతో రెండు ప్రధాన సమస్యలు తలెత్తాయి. ఒకటి భారత్​కు జీఎస్​పీ హోదా రద్దు. రెండోది ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాల విధింపు. ఈ విషయంలో డబ్ల్యూటీఓ ఒప్పందాలకు వ్యతిరేకంగా అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఓ తీవ్రమైన పరిణామం' అని జయంత్​ దాస్​ గుప్తా విశ్లేషిస్తున్నారు.

ఈ చర్యలతో భారత్​పై ఒత్తిడి పెంచి తమకు కావాల్సిన వాటిని సాధించుకోవాలని అమెరికా భావిస్తోంది. భారత్​కు జీఎస్​పీ హోదాను పునరుద్ధరించేందుకు బదులుగా మినీ ట్రేడ్​ డీల్​ కోసం అమెరికా కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది.

అమెరికా డిమాండ్లు..

వైద్య పరికరాల ధరలపై పరిమితుల తొలగింపు, అమెరికా డైరీ ఉత్పత్తులు, మొబైల్​ ఫోన్లు, మోటార్స్ బైక్​లు, హై ఎండ్ ఐటీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్లు విరివిగా విక్రయించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని అమెరికా కోరుతోంది. మరి బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అంశాలను ఎలా పరిష్కరిస్తారనే విషయంపై వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు.

వీసాల విషయంలో బైడెన్​ నుంచి సానుకూలతలే!

హెచ్​1 బీ వీసాలపై ఆంక్షల సడలింపునకు భారత్​ కోరితే బైడెన్​ కాస్త సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయంటున్నారు జయంత్ దాస్ గుప్తా. అయితే ఈ నిర్ణయం కూడా తమ దేశ ఐటీ పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు మాత్రమే కావచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అమెరికా ఎన్నికల ఫలితాలను స్వాగతించిన జుకర్​బర్గ్

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్ వచ్చే ఏడాది నుంచి పాలన సాగించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానంలో బైడెన్ అగ్రరాజ్య పీఠమెక్కుతున్న నేపథ్యంలో చాలా దేశాలు వాణిజ్య పరంగా భారీ మార్పులు రావచ్చని అంచనాలు వేసుకుంటున్నాయి. మరి భారత్ విషయంలో ఈ అంచనాలు ఎలా ఉన్నాయి? బైడెన్ అధికారంలోకి వస్తే భారత్​-అమెరికా వాణిజ్య బంధాలు మెరుగవుతాయా? అనే అంశంపై నిపుణుల విశ్లేషణలు ఇలా ఉన్నాయి.

బైడెన్ అధ్యక్ష పదవిలోకి వచ్చినా.. అమెరికాతో వాణిజ్యం విషయంలో భారత్ పెద్ద మార్పులను ఆశించడలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వరల్డ్ ట్రేడ్​ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) భారత మాజీ అంబాసిడర్​ జయంత్​ దాస్​ గుప్తా ఈ అంశంపై 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

'డెమొక్రాట్లు, రిపబ్లికన్లు రెండు పార్టీల అధ్యక్షుల పాలనల్లోనూ భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు బలహీన పడుతూ వచ్చాయి. ఇప్పుడు బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టాక భారత్​తో వాణిజ్యం విషయంలో అమెరికా వైఖరిలో పెద్ద మార్పు ఉంటుందని అనుకోవడం లేదు' అని జయంత్ అభిప్రాయపడ్డారు.

ఇరు దేశాల వాణిజ్యం ఇలా..

భారత్-అమెరికాల ద్వైపాక్షిక వాణిజ్యం 2000 సంవత్సరంలో 19 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2018 నాటికి అది 142 బిలియన్ డాలర్లకు పెరిగింది. అది ఈ ఏడాది 150 బిలియన్​ డాలర్లు దాటుతుందని అంచనా. ఏదేమైనప్పటికీ.. ఇరు దేశాధినేతలు జాతీయ ఆర్థిక విధానాలను పాటింస్తుండటం వల్ల కొన్నాళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ప్రతీకార చర్యలు..

కొన్నాళ్లుగా ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య అంశాల్లో విబేధాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు అమెరికా బహిరంగంగానే భారత్​పై కోపాన్ని వ్యక్తం చేసింది. సుంకాల పెంపు, మేధో సంపత్తి హక్కులు వంటి పరిణామాలే ఇందుకు ఉదాహరణ.

ఇందులో భాగంగా భారత్​ సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియం వంటి లోహాలపై సుంకాలు విధిస్తూ ట్రంప్ యంత్రాంగం 2018లో నిర్ణయం తీసుకుంది. భారత్​కు గత ఏడాది ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్​పీ) కూడా రద్దు చేసింది. ఈ నిర్ణయాలకు బదులుగా 1.3 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఎగుమతులపై సుంకాలపెంపుతో భారత్ ప్రతీకార చర్యకు దిగింది.

'ట్రంప్ పాలనలతో రెండు ప్రధాన సమస్యలు తలెత్తాయి. ఒకటి భారత్​కు జీఎస్​పీ హోదా రద్దు. రెండోది ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాల విధింపు. ఈ విషయంలో డబ్ల్యూటీఓ ఒప్పందాలకు వ్యతిరేకంగా అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఓ తీవ్రమైన పరిణామం' అని జయంత్​ దాస్​ గుప్తా విశ్లేషిస్తున్నారు.

ఈ చర్యలతో భారత్​పై ఒత్తిడి పెంచి తమకు కావాల్సిన వాటిని సాధించుకోవాలని అమెరికా భావిస్తోంది. భారత్​కు జీఎస్​పీ హోదాను పునరుద్ధరించేందుకు బదులుగా మినీ ట్రేడ్​ డీల్​ కోసం అమెరికా కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది.

అమెరికా డిమాండ్లు..

వైద్య పరికరాల ధరలపై పరిమితుల తొలగింపు, అమెరికా డైరీ ఉత్పత్తులు, మొబైల్​ ఫోన్లు, మోటార్స్ బైక్​లు, హై ఎండ్ ఐటీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్లు విరివిగా విక్రయించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని అమెరికా కోరుతోంది. మరి బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అంశాలను ఎలా పరిష్కరిస్తారనే విషయంపై వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు.

వీసాల విషయంలో బైడెన్​ నుంచి సానుకూలతలే!

హెచ్​1 బీ వీసాలపై ఆంక్షల సడలింపునకు భారత్​ కోరితే బైడెన్​ కాస్త సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయంటున్నారు జయంత్ దాస్ గుప్తా. అయితే ఈ నిర్ణయం కూడా తమ దేశ ఐటీ పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు మాత్రమే కావచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అమెరికా ఎన్నికల ఫలితాలను స్వాగతించిన జుకర్​బర్గ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.