ETV Bharat / business

రూ.5 వేల కోట్లు సమీకరణకు ఎస్​ బ్యాంకు బోర్డు ఆమోదం

author img

By

Published : Mar 27, 2020, 8:53 AM IST

సంక్షోభంలో ఉన్న ఎస్​ బ్యాంకు రూ.5 వేల కోట్ల నిధులు సమీకరించేందుకు ఆ సంస్థ బోర్డు పచ్చజెండా ఊపింది. మారటోరియం ఎత్తేసిన తర్వాత జరిగిన బోర్డు సమావేశంలో అర్హత కలిగిన సంస్థలు, హక్కులు, షేర్లు కొనుగోలు ద్వారా నిధుల సేకరణకు అంగీకారం తెలిపింది.

yes bank
ఎస్ బ్యాంకు

అర్హత కలిగిన సంస్థలు, హక్కులు, షేర్ల కొనుగోలుతో రూ.5,000 కోట్ల నిధుల సమీకరణకు ఎస్ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. తాజాగా జరిగిన బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమావేశంలో బ్యాంకు ఎండీ, సీఈఓగా ప్రశాంత్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

అర్హత కలిగిన సంస్థలే కాకుండా భద్రతపరమైన హామీ మార్గాలు, హక్కులు, అంతర్జాతీయ డిపాజిటరీ రశీదులు, అమెరికన్ డిపాజిటరీ రశీదులు, విదేశీ కరెన్సీ మారకం బాండ్లు లేదా ఏదైనా ఆమోదించదగిన మార్గంలో ఈ నిధులను సేకరించనున్నట్లు బోర్డు తెలిపింది.

ఇప్పటికే రూ.10వేల కోట్లకు అంగీకారం..

అయితే నిధుల సేకరణ రూ.15 వేల కోట్లకు మించకూడదు. ఇప్పటికే 2020 ఫిబ్రవరి 7న రూ.10 వేల కోట్ల నిధుల సేకరణకు బోర్డు ఆమోదం తెలపగా.. ప్రస్తుతం మరో రూ.5 వేల కోట్లకు అంగీకారం లభించింది.

దేశంలో నాలుగో అతిపెద్ద ప్రైవేట్ రుణదాతగా ఉన్న ఎస్​ బ్యాంకు సంక్షోభం కారణంగా రిజర్వ్ బ్యాంకు చర్యలు చేపట్టింది. మారటోరియం విధించి బ్యాంకు యాజమాన్యాన్ని మార్చింది. ఎస్​ బ్యాంకు పునరుద్ధరణ పథకం ఆమోదించిన తర్వాత మారటోరియాన్ని ఎత్తివేసింది ఆర్​బీఐ.

ఎస్​బీఐకి 49 శాతం వాటా..

ఈ స్కీము ప్రకారం ఎస్​ బ్యాంకులో ఎస్​బీఐ 49 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. ఎస్​బీఐతో కలిసి కొన్ని ప్రైవేట్​ బ్యాంకులు ఎస్​ బ్యాంకులో రూ.10 వేల కోట్లు చొప్పించాలని నిర్ణయించారు. ఇందులో ఎస్​బీఐ వాటా రూ.6,050 కోట్లు. ప్రైవేట్ రుణదాతల్లో ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్​, ఐడీఎఫ్​సీ, బంధన్, ఫెడరల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులు రూ.3 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు.

ఇదీ చూడండి: బ్యాంకింగ్ రంగం జోరుతో మార్కెట్లలో లాభాల హోరు

అర్హత కలిగిన సంస్థలు, హక్కులు, షేర్ల కొనుగోలుతో రూ.5,000 కోట్ల నిధుల సమీకరణకు ఎస్ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. తాజాగా జరిగిన బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమావేశంలో బ్యాంకు ఎండీ, సీఈఓగా ప్రశాంత్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

అర్హత కలిగిన సంస్థలే కాకుండా భద్రతపరమైన హామీ మార్గాలు, హక్కులు, అంతర్జాతీయ డిపాజిటరీ రశీదులు, అమెరికన్ డిపాజిటరీ రశీదులు, విదేశీ కరెన్సీ మారకం బాండ్లు లేదా ఏదైనా ఆమోదించదగిన మార్గంలో ఈ నిధులను సేకరించనున్నట్లు బోర్డు తెలిపింది.

ఇప్పటికే రూ.10వేల కోట్లకు అంగీకారం..

అయితే నిధుల సేకరణ రూ.15 వేల కోట్లకు మించకూడదు. ఇప్పటికే 2020 ఫిబ్రవరి 7న రూ.10 వేల కోట్ల నిధుల సేకరణకు బోర్డు ఆమోదం తెలపగా.. ప్రస్తుతం మరో రూ.5 వేల కోట్లకు అంగీకారం లభించింది.

దేశంలో నాలుగో అతిపెద్ద ప్రైవేట్ రుణదాతగా ఉన్న ఎస్​ బ్యాంకు సంక్షోభం కారణంగా రిజర్వ్ బ్యాంకు చర్యలు చేపట్టింది. మారటోరియం విధించి బ్యాంకు యాజమాన్యాన్ని మార్చింది. ఎస్​ బ్యాంకు పునరుద్ధరణ పథకం ఆమోదించిన తర్వాత మారటోరియాన్ని ఎత్తివేసింది ఆర్​బీఐ.

ఎస్​బీఐకి 49 శాతం వాటా..

ఈ స్కీము ప్రకారం ఎస్​ బ్యాంకులో ఎస్​బీఐ 49 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. ఎస్​బీఐతో కలిసి కొన్ని ప్రైవేట్​ బ్యాంకులు ఎస్​ బ్యాంకులో రూ.10 వేల కోట్లు చొప్పించాలని నిర్ణయించారు. ఇందులో ఎస్​బీఐ వాటా రూ.6,050 కోట్లు. ప్రైవేట్ రుణదాతల్లో ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్​, ఐడీఎఫ్​సీ, బంధన్, ఫెడరల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులు రూ.3 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు.

ఇదీ చూడండి: బ్యాంకింగ్ రంగం జోరుతో మార్కెట్లలో లాభాల హోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.