రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ దాదాపు 92 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 39,061 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 11,720 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
లాభానష్టాల్లో ఉన్నవి..
ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ సన్ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఎస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐటీసీ, హెచ్యూఎల్, ఐటీసీ, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి, ముడి చమురు
నేటి సెషన్ ప్రారంభంలో రూపాయి 4 పైసలు పుంజుకుంది. డాలర్తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 69.67 వద్ద ట్రేడవుతోంది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.51 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 71.81 వద్ద కొనసాగుతోంది.
ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లన్నీ నేడు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి.