ETV Bharat / business

ఫలితాల ముందు సానుకూల ముగింపు..

అమ్మకాల ఒత్తిడితో చివరి సెషన్​ నష్టపోయిన స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 140 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 29 పాయింట్లు బలపడింది.

author img

By

Published : May 22, 2019, 4:05 PM IST

స్టాక్​ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. ఈ తరుణంలో కొత్త ప్రభుత్వంపై అంచనాలతో నేడు ఆచితూచి వ్యవహరించారు మదుపరులు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 140 పాయింట్లు బలపడింది. చివరకు 39,110 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 29 పాయింట్లు వృద్ధి చెందింది. 11,734 వద్ద సెషన్ ముగించింది.

ఇంట్రాడే సాగిందిలా...

సెన్సెక్స్ ఇంట్రాడేలో 38,904-39,249 పాయింట్ల మధ్య కదలాడింది. నిఫ్టీ నేడు 11,785 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 11,682 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

లాభనష్టాల్లోనివివే..

ఇండస్​ఇండ్​ బ్యాంకు 4.84 శాతం, సన్ ఫార్మా 3.46 శాతం, బజాజ్ ఆటో 2.29 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.83 శాతం, కోల్ ఇండియా 1.77 శాతం, టాటా మోటార్స్​ 1.61 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.44 శాతం లాభాలను ఆర్జించాయి.

ఎస్​ బ్యాంకు 2.34 శాతం, ఐటీసీ 1.74 శాతం, టీసీఎస్​ 1.25 శాతం, పవర్ గ్రిడ్ 1.03 శాతం, హెచ్​యూఎల్ 0.65 శాతం నష్టాలను నమోదుచేశాయి.

రూపాయి, ముడి చమురు

నేటి ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. డాలర్​తో రూపాయి మారకం విలువ 69.68కి చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.64 శాతం పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్​ ముడి చమురు ధర 71.72 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండీ: హిందుజా ఆసక్తితో దూసుకెళ్తున్న జెట్​ షేర్లు

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. ఈ తరుణంలో కొత్త ప్రభుత్వంపై అంచనాలతో నేడు ఆచితూచి వ్యవహరించారు మదుపరులు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 140 పాయింట్లు బలపడింది. చివరకు 39,110 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 29 పాయింట్లు వృద్ధి చెందింది. 11,734 వద్ద సెషన్ ముగించింది.

ఇంట్రాడే సాగిందిలా...

సెన్సెక్స్ ఇంట్రాడేలో 38,904-39,249 పాయింట్ల మధ్య కదలాడింది. నిఫ్టీ నేడు 11,785 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 11,682 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

లాభనష్టాల్లోనివివే..

ఇండస్​ఇండ్​ బ్యాంకు 4.84 శాతం, సన్ ఫార్మా 3.46 శాతం, బజాజ్ ఆటో 2.29 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.83 శాతం, కోల్ ఇండియా 1.77 శాతం, టాటా మోటార్స్​ 1.61 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.44 శాతం లాభాలను ఆర్జించాయి.

ఎస్​ బ్యాంకు 2.34 శాతం, ఐటీసీ 1.74 శాతం, టీసీఎస్​ 1.25 శాతం, పవర్ గ్రిడ్ 1.03 శాతం, హెచ్​యూఎల్ 0.65 శాతం నష్టాలను నమోదుచేశాయి.

రూపాయి, ముడి చమురు

నేటి ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. డాలర్​తో రూపాయి మారకం విలువ 69.68కి చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.64 శాతం పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్​ ముడి చమురు ధర 71.72 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండీ: హిందుజా ఆసక్తితో దూసుకెళ్తున్న జెట్​ షేర్లు

Thiruvananthapuram (Kerala), May 22 (ANI): While speaking to ANI, Bharatiya Janata Party (BJP) Kerala unit president PS Sreedharan Pillai said Kerala BJP has decided to sue and prosecute Finance Minister Thomas Isaac of CPM for his defamatory statement. Pillai said, "Kerala BJP has decided to sue and prosecute Finance Minister Thomas Isaac of CPM for a defamatory statement he made on May 06. I have claimed Rs 10 crore as compensation besides seeking criminal prosecution against Isaac." Earlier, Isaac had reportedly alleged that Pillai is making use of his position as the BJP state president as a golden opportunity to sabotage development in Kerala.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.