ETV Bharat / business

ఐటీ షేర్లు కుదేలు.. స్వల్ప నష్టాలు

author img

By

Published : May 3, 2019, 4:05 PM IST

Updated : May 3, 2019, 7:23 PM IST

వారంతంలోను స్టాక్​ మార్కెట్లు నిరాశే మిగిల్చాయి. సెన్సెక్స్ 18 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయింది. వారం మొత్తం మీద సెన్సెక్స్​ 104 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు క్షీణించాయి.

స్టాక్​ మార్కెట్లు

వారంలో చివరి సెషన్​ను స్వల్ప నష్టాలతో ముగించాయి స్టాక్​ మార్కెట్లు. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 18.17 పాయింట్లు నష్టపోయింది. సెషన్ ముగిసే సమయానికి 38,963.26 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 12.50 పాయింట్లు క్షీణించింది. సెషన్ ముగిసే సమయానికి 11,712.25కు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్ 39,172.76 38,920.17
నిఫ్టీ 11,770.90 11,699.35

ఇవీ కారణాలు:

ఆంరంభంలో లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

ముఖ్యంగా కాగ్నిజెంట్ ఆదాయ వృద్ధి అంచనాను 3.6-5.1 శాతానికి సవరించింది. ఏప్రిల్​లో ప్రకటించిన 7-9 శాతం వృద్ధితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఈ కారణంగా కంపెనీ షేర్లు డీలా పడ్డాయి. వీటి ప్రభావం ఐటీ రంగంపై పడింది.

లాభనష్టాల్లోనివివే..

సెన్సెక్స్​లో భారతీ ఎయిర్​టెల్​ అత్యధికంగా 3.11 శాతం లాభాలను నమోదు చేసింది. ఎన్​టీపీసీ 1.99 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.84 శాతం, టాటా మోటార్స్ 1.13 శాతం, యెస్​ బ్యాంకు 1.04 శాతం, ఓఎన్​జీసీ 0.97 శాతం లాభాలను అర్జించాయి.

టీసీఎస్​ అత్యధికంగా 3.70 శాతం నష్టపోయింది. హెచ్​యూఎల్ 2.20 శాతం, టాటా స్టీల్​ 1.31 శాతం, హెచ్​సీఎల్​ టెక్​ 1.09 శాతం, ఇన్ఫోసిస్​ 0.84 శాతం, బజాజ్ ఫినాన్స్​ 0.64 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇతర మార్కెట్లు ఇలా..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు దక్షిణ కొరియా సూచీ కోస్పి, హాంకాంగ్​ సూచీ హాంగ్​సెంగ్​ మిశ్రమంగా ముగిశాయి. జపాన్​, చైనా ఎక్స్చేంజిలు నేడు సెలవులో ఉన్నాయి.

రూపాయి, ముడిచమురు

నేటి ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. ప్రస్తుతం డాలర్​ పోలిస్తే రూపాయి మారకం విలువ 69.34కు చేరింది.

ముడి చమురు ధరల బ్రెంట్ సూచీ ​ 0.62 శాతం తగ్గింది. బ్యారెల్​ ముడి చమురు ధర 70.31 డాలర్లకు చేరింది.

వారంలో చివరి సెషన్​ను స్వల్ప నష్టాలతో ముగించాయి స్టాక్​ మార్కెట్లు. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 18.17 పాయింట్లు నష్టపోయింది. సెషన్ ముగిసే సమయానికి 38,963.26 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 12.50 పాయింట్లు క్షీణించింది. సెషన్ ముగిసే సమయానికి 11,712.25కు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్ 39,172.76 38,920.17
నిఫ్టీ 11,770.90 11,699.35

ఇవీ కారణాలు:

ఆంరంభంలో లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

ముఖ్యంగా కాగ్నిజెంట్ ఆదాయ వృద్ధి అంచనాను 3.6-5.1 శాతానికి సవరించింది. ఏప్రిల్​లో ప్రకటించిన 7-9 శాతం వృద్ధితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఈ కారణంగా కంపెనీ షేర్లు డీలా పడ్డాయి. వీటి ప్రభావం ఐటీ రంగంపై పడింది.

లాభనష్టాల్లోనివివే..

సెన్సెక్స్​లో భారతీ ఎయిర్​టెల్​ అత్యధికంగా 3.11 శాతం లాభాలను నమోదు చేసింది. ఎన్​టీపీసీ 1.99 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.84 శాతం, టాటా మోటార్స్ 1.13 శాతం, యెస్​ బ్యాంకు 1.04 శాతం, ఓఎన్​జీసీ 0.97 శాతం లాభాలను అర్జించాయి.

టీసీఎస్​ అత్యధికంగా 3.70 శాతం నష్టపోయింది. హెచ్​యూఎల్ 2.20 శాతం, టాటా స్టీల్​ 1.31 శాతం, హెచ్​సీఎల్​ టెక్​ 1.09 శాతం, ఇన్ఫోసిస్​ 0.84 శాతం, బజాజ్ ఫినాన్స్​ 0.64 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇతర మార్కెట్లు ఇలా..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు దక్షిణ కొరియా సూచీ కోస్పి, హాంకాంగ్​ సూచీ హాంగ్​సెంగ్​ మిశ్రమంగా ముగిశాయి. జపాన్​, చైనా ఎక్స్చేంజిలు నేడు సెలవులో ఉన్నాయి.

రూపాయి, ముడిచమురు

నేటి ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. ప్రస్తుతం డాలర్​ పోలిస్తే రూపాయి మారకం విలువ 69.34కు చేరింది.

ముడి చమురు ధరల బ్రెంట్ సూచీ ​ 0.62 శాతం తగ్గింది. బ్యారెల్​ ముడి చమురు ధర 70.31 డాలర్లకు చేరింది.

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
Last Updated : May 3, 2019, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.